సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 22: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్జైన్ను కోరారు. ఈ మేరకు సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని అతడి చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు.
అభివృద్ధి పనులను వేగవం తం చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కరించాలని, సదాశివపేట మండ లం బొబ్బిలిగామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న నీటి ట్యాంకు శిథిలావస్థకు చేరుకున్నదని, పాఠశాల భవనం గోడలు దెబ్బతినడంతో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉన్నదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే తగిన మరమ్మతులు చేపట్టాలని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూ రు చేయాలని కోరారు. ఎస్డీఎఫ్ కింద రూ.5 కోట్లతో నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, 4 మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్లో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంటి నంబర్లు జారీ చేసిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కంది మండలం ఉత్తర్పల్లి గ్రామ పరిధిలో రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల అంచనాతో పరిపాలన అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సూరారం ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని, గిర్మాపూర్లో రీజినల్ రింగ్ రోడ్డు భూ బాధితులకు నష్ట పరిహారం చెల్లింపులో బయోమెట్రిక్ విధానాన్ని సడలించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే సక్రమంగా చేయడం లేదని కలెక్టర్కు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు.