మెదక్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు, పోడు భూముల పట్టాల పంపిణీ, జీవో నంబర్ 58, 59, 118 తో పాటు, తెలంగాణకు హరితహారం లాంటి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి మెదక్ కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అవసరమైన మందులు, రీడింగ్ కండ్లద్దాలు తెప్పించుకోవాలన్నా రు. జీవో నంబర్ 58, 59 కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పట్టాలు పంపిణీ చేయాలన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని, ఎకడ ఉన్నా దానికి కంచె వేయాలన్నారు.
కంటి వెలుగుకు మంచి స్పందన: కలెక్టర్ రాజర్షి షా
కంటి వెలుగుకు జిల్లాలో మంచి స్పందన లభిస్తున్నదని, నేటి వరకు 121 పంచాయతీల్లో ఈ శిబిరాలు నిర్వహించామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 1,13,687 మందిని పరీక్షించి, 15,318 మందికి రీడింగ్ అద్దాలు, 1,853 ప్రిసిప్షన్ అద్దాలు అందజేశామన్నారు. నిర్దేశించిన లక్ష్యంలో ఇప్పటి వరకు 33 శాతం సాధించామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను పీఎంఏవై అర్బన్ పోర్టల్లో నమోదు చేశామన్నారు. జిల్లా స్థాయి కమిటీలో ఆమోదం పొందిన 488 మంది గిరిజనులకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి పాస్ పుస్తకాలు సిద్ధం చేస్తున్నామన్నారు. హరితహారానికి 36 లక్షల మొకలు నర్సరీల్లో పెంచుతున్నామన్నారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఎంఅండ్ హెచ్వో చందు నాయక్, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, జిల్లా అటవీ శాఖ అధికారి రవిప్రసాద్, జడ్పీ సీఈవో శైలేశ్, ఆర్డీవోలు సాయిరామ్, శ్యామ్ ప్రకాశ్, మైన్స్ సహాయ సంచాలకుడు జయరాజ్, కలెక్టరేట్ ఏవో యూనూస్ పాల్గొన్నారు.