నారాయణఖేడ్/ కొండాపూర్/ అల్లాదుర్గం, జూలై 24: వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తూ సోమవారం కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నారాయణఖేడ్, కొండాపూర్, అల్లాదుర్గం మండల కేంద్రాల్లో వారు వేర్వేరుగా క్షీరాభిషేకాలు చేసి, మిఠాయిలు పంచిపెట్టి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో జీవితాలను నెట్టుకొస్తున్న తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పెద్ద మనసుతో తమకు పే స్కేల్ వర్తింపజేసి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామన్నారు.
కార్యక్రమంలో నారాయణఖేడ్లో వీఆర్ఏల సంఘం బాధ్యులు ఖాజా, రాజ్కుమార్, లక్ష్మయ్య, సాయిలు, బాల్రాజ్, కొండాపూర్లో వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు ఇఫ్తికార్ అలీ, నాయకులు రఘు, ఆంజనేయులు, లింగమయ్య, మనోహర్, జ్యోతి, కవిత, మంజుల, సాయి, అల్లాదుర్గంలో వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు పాపయ్య, రాజేష్, లింగమణి, దుర్గయ్య, కిష్టయ్య, అనిల్, కృష్ణ, సాయిలు, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు.