సంగారెడ్డి, మే 26: స్థానికంగా వార్డుల్లో జరిగే పనులు నాణ్యతగా ఉండాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ఆయా పనులను వారు కూడా పరిశీలించాలని చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని 27వ వార్డు శాంతినగర్లోని రూ.30 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ 20 ఏండ్లుగా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించామన్నారు.
పట్టణాభివృద్ధికి సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ సభలో రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించగా, అదనంగా మరో రూ.10 కోట్లు విడుదల చేసి అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. పట్టణాభివృద్ధికి ప్రజలు సహకరించాలని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు. పట్టణ ప్రజల తరఫున సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నక్క మంజులత, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.వెంకటేశ్వర్లు, నర్సింలు, బీఆర్ఎస్ నాయకులు విజయేందర్రెడ్డి, శేఖర్, జీవీ శ్రీనివాస్, జలేందర్, వార్డు పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.