సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 17 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూలు విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే తప్పక రసీదులు చూపించాల్సి ఉంటుంది. పెళ్ళిళ్ల సీజన్ నేపథ్యంలో ఎక్కువ నగదు తీసుకెళ్తే అందుకు తగిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
అధికారులు ఈ మేర కు చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అసెంబ్లీ ఐదు నియోజకవర్గాలు జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానాలకు వస్తాయి. ఈ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ జారీ కానున్నది. అదే నెల 25న నామినేషన్లకు గడు వు పూర్తి కానుండగా, 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనున్నది. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు, 6న ఎన్నికల ప్ర క్రియ ముగిసేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జిల్లాలో అమలులోకి వచ్చింది.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 14,18,688 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 7,11,011 మంది పురుషులు ఉండగా, 7,07,538 మంది మహిళా ఓటర్లు, 139 మంది ట్రాన్స్జెండర్లు, 353 సర్వీసు ఓటర్లు ఉన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 16,35,042 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనుండగా, అందు లో 7,98,888 మంది పురుషులు, 8,36, 095మంది మహిళా ఓటర్లు, 59 మంది ట్రాన్స్జెండర్లు, 967 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 18 నుంచి 19 ఏండ్ల్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 52,464 మంది ఉండగా, 32,315 మంది పీడబ్ల్యూడీ, 7,853 మంది 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 1594 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, 1313 సాధారణ పోలింగ్ కేంద్రాలు, 281సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు.
జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తినా 1950కు ఫోన్ చేసి తెలియజేయాలి. ఈ కాల్సెంటర్ 24 గంటల పాటు పనిచేస్తుంది. ఎన్నికలకు ఎలాంటి విఘాతం కలిగించే చర్యలైనా సీ విజిల్ యాప్లో పొందుపర్చాలి. సంబంధిత అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని చర్యలు తీసుకుంటారు. జిల్లాలో ఇప్పటి వరకు ఓటరుగా నమో దు కాని వారు వెంటనే ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చు. మార్పుల కోసం ఫారం-8ని కూడా సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామా ల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లను తొలిగిస్తాం. ఎన్నికల వ్యయానికి సంబంధించి అభ్యర్థులు విధిగా ప్రత్యేక ఖాతా తెరవాలి. సదరు ఖాతా ద్వారా మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఖర్చు చేసుకు నే అవకాశం ఉంది. అందుకు వ్యయ పరిశీలకుల బృందం ఎప్పటికప్పుడు వ్యయా న్ని పరిశీలిస్తుంది. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం.
– వల్లూరు క్రాంతి, సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్