రామాయంపేట, డిసెంబర్ 26 : వార్డుల్లో వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌ డ్ పేర్కొన్నారు. సోమవారం వార్డు పర్యటనలో భాగంగా పురపాలికలోని రెండో వార్డులోని గిరిజన తండా, కోమటిపల్లిలను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పురపాలికలోని 12వార్డుల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
వార్డుల అభివృద్ధికి మంత్రి హరీశ్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిల ద్వారా ప్రత్యేక నిధులను సేకరించి అభివృద్ధి చేస్తామన్నారు. వార్డులో ముఖ్యంగా మురుగు కాల్వలు, సీసీ రోడ్లకే ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. వార్డులోని ప్రతి గల్లీలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలను నిర్మిస్తామన్నారు. వా ర్డు పర్యటనలో వార్డు కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్సింగ్, బొర్ర అనిల్, నాయకులు సరాఫ్ వ్యాం సుందర్, దేవుని రాజు, మ ల్యాల కిషన్, యాదగిరి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ సాయిరాంరెడ్డి, వర్క్ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శంకర్, కాలేరు ప్రసాద్, ఎల్లం, శివరాజు, వెంకటస్వామిలు ఉన్నారు.