సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 2: మెదక్ లోక్సభకు పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుపై సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 504 కింద సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మార్చి 27న మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిలపై రఘునందన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘనపై ఎన్నికల కమిషన్కు కూడా ఎమ్మె ల్యే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.