గ్యాస్ ధరల పెంపుపై రెండో రోజూ నిరసనలు మిన్నంటాయి. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, వివిధ పార్టీల శ్రేణులు కేంద్రం తీరుపై దుమ్మెత్తిపోశారు. మహిళలు ఖాళీ సిలిండర్లు ప్రదర్శించి, కట్టెల పొయ్యిలపై వంట చేశారు. ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, మదన్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ సర్కార్ పేదల సొమ్ము లాక్కొని.. పెద్దల జేబులు నింపుతున్నదని, బీజేపీ హయాంలో సామాన్య, మధ్యతరగతి బతుకులు అంధకారమయ్యాయన్నారు. ధరలు తగ్గించేవరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో మోదీని గద్దె దించి, బీఆర్ఎస్కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
– సంగారెడ్డి/ మెదక్, న్యూస్నెట్వర్క్, మార్చి 3
తూప్రాన్/ వెల్దుర్తి/ కౌడిపల్లి/ కొల్చారం/ రేగోడ్/ రామాయంపేట రూరల్, మార్చి 3 : దేశంలో రైతు రాజ్యం రావాలని, రైతురాజ్యం రావాలంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని కరీంగూడ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై మహిళలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామ న్నారు. దేశంలో నిత్యవసరాల ధరలు తగ్గాలంటే ప్రధాని మోదీ గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర భుత్వం కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. రాష్ర్టాభివృద్ధికి అడ్డుపడుతున్న నరేంద్రమోడీని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగానికి 24 గంటల కరెంటిచ్చి, పండించిన పంటను కొనుగోలు చేస్తున్న సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సతీశ్ చారి, మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మనోహరాబాద్ మండల అధ్యక్షుడు పురం మహేశ్వర్, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్రెడ్డి, ఎంపీపీ పురం నవనీత, పీఏసీఎస్ చై ర్మన్ బాలకృష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, సర్పంచ్లు మల్లేశ్, వెంకట్రామ్రెడ్డి, భగవాన్రెడ్డి, కౌ న్సిలర్లు నారాయణగుప్త్తా, రవీందర్రెడ్డి, నాయకులు పురం రవి, వెంకటేశ్యాదవ్, మామిండ్ల కృష్ణ, చక్రవర్తి, చంద్రశేఖర్, బాలకృష్ణ, మన్నె శ్రీనివాస్, తప్పెట శ్రీనివాస్, అజర్, బురాన్, అహ్మద్, చంద్రారెడ్డి, దామోదర్రెడ్డి ఉన్నారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలకేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, ఎంపీటీసీ మో హన్రెడ్డి, సర్పంచ్ అశోక్రెడ్డి, నేతలు నరేందర్రెడ్డి, రమేశ్, ఆంజనేయులు, కృష్ణాగౌడ్, అశోక్గౌడ్, అశోక్రెడ్డి, శ్రవణ్, గంగాధర్, శ్రీనివాస్గౌడ్, నాగరాజు, అశోక్, పవన్ ఉన్నారు.
కౌడిపల్లి మండలకేంద్రంలో జరిగిన ఆందోళనలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామాగౌడ్, ఎంపీపీ రాజునాయక్, వైస్ ఎంపీపీ నవీన్గుప్తా, జడ్పీటీసీ కవితాఅమర్సింగ్, ఎంపీటీసీ శివాంజనేయులు, సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ ప్రవీణ్కుమార్, బీఆర్ఎస్వై నాయకుడు కృష్ణగౌడ్ ఉన్నారు.
కొల్చారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు వంటావార్పు చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరీశంకర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ సావిత్రిరెడ్డి, సర్పంచ్లు విష్ణువర్ధన్రెడ్డి, కరెంటు ఉమాదేవి, గోదావరి, నెల్లి కిష్టయ్య, గౌడ సంఘం మండలాధ్యక్షుడు వెంకట్గౌడ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, నాయకులు సందీప్, నర్సింహులు, దుర్గేశ్ పాల్గొన్నారు. అందోల్ ఎమ్యెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో జోగిపేటలో నిర్వహించిన నిరసనలో రేగోడ్ మండలానికి చెందిన నాయకులు పాల్గొన్నారు. వీరిలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సుంకె రమేశ్, ఎంపీటీసీ నర్సింహులు, నాయకులు వినోద్, మచ్కూరి రవీందర్, నాగయ్య, స్వామి పాల్గొన్నారు.