రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిలాల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొంది. ప్రతి రౌండ్లోనూ గులాబీ జోరు కనిపించింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఆందోల్, నారాయణ్ఖేడ్, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ స్థానం కాంగ్రెస్ గెలుచుకోగా, జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం సాధించింది. జిల్లాలో కారు స్పీడ్కు కాంగ్రెస్, బీజేపీలు తట్టుకోలేక పోయాయి. గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి పోటీచేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏడోసారి బరిలోకి దిగిన మంత్రి హరీశ్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. దుబ్బాక దుమ్ములేచేలా ఇక్కడి ప్రజలు కొత్త ప్రభాకర్రెడ్డిని 53, 513 ఓట్ల మెజార్టీ కట్టబెట్టారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
సిద్దిపేట, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ విజయ దుం దుభి మోగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీచినప్పటికి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ తన పట్టును నిలపుకొంది. ప్రతి రౌండ్లోనూ బీఆర్ఎస్ జోరు కనిపించింది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆందోల్, నారాయణ్ఖేడ్, మెదక్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ స్థానం కాంగ్రెస్ గెలుచుకోగా, జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. జిల్లాలో కారు స్పీడ్కు కాం గ్రెస్, బీజేపీలు తట్టుకోలేక పోయాయి. గజ్వేల్ శాసనసభ స్థానం నుంచి పోటీచేసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఈటల రాజేందర్పై 45,031 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిద్దిపేట నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏడోసారి బరిలోకి దిగిన మంత్రి హరీశ్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్కు చెందిన పూజల హరికృష్ణపై 82,156 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్రావుపై 53,513 ఓట్ల మెజార్టీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. తొలిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. నర్సాపూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రాజిరెడ్డిపై 9,855 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్పై 13, 310 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరుసగా ఆయన రెండోసారి గెలుపొందారు. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగ్గారెడ్డిపై 8,725 ఓట్ల మెజార్టీతో, పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్పై 7091ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వరుసగా ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గూడెం మహిపాల్రెడ్డి హ్యాట్రిక్ కొట్టారు. జనగామ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్రెడ్డిపై 16,836 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడుచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అందోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర్ రాజనర్సింహ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్పై 27,427 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి రోహిత్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డిపై 10,157 ఓట్ల మెజార్టీ, నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పట్లోళ్ల సంజీవరెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్రెడ్డిపై 5,766 ఓట్ల మెజార్టీ, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన పొన్నం ప్రభాకర్ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్పై 19,344 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. గత ఉప ఎన్నికల్లో ఇక్కడ స్వల్ప ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో19 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టారు. ప్రతి రౌండ్లోనూ బీఆర్ఎస్ భారీ మెజార్టీతో దూసుకుపోయింది. 19 రౌండ్ ముగిసే సరికి దుబ్బాక దుమ్ములేచేలా ఇక్కడి ప్రజలు కొత్త ప్రభాకర్రెడ్డిని 53, 513 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతైంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి తన్నీరు హరీశ్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 83,025 ఓట్ల మెజార్టీని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు కట్టబెట్టారు. దుబ్బాక నుంచి మొదటి సారిగా శాసన సభ స్థానానికి పోటీ చేసిన కొత్త ప్రభాకర్రెడ్డికి 53,513 ఓట్ల భారీ మెజార్టీతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. జిల్లాలో నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజీవరెడ్డికి 5,766 ఓట్ల అత్యల్ప మెజార్టీ వచ్చింది.