మెదక్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ ఎత్తున రోడ్డు షో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ధ్యాన్చంద్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొననున్నారు.
పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని రోడ్షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు కంచుకోట అయిన మెదక్లో మరోసారి గులాబీ జెండాఎగరడం ఖాయమన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని గెలిపించి బీఆర్ఎస్ సత్తాచాటాలన్నారు. ప్రభుత్వ అధికారిగా విశిష్ట సేవలందించిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వేసవి నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన నాయకులకు సూచించారు.