ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది, బంగారు తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్ర పార్టీలు కుమ్మక్కై తెలంగాణను దోచుకోవడానికి చూస్తున్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం వెల్దుర్తి మండలంలోని యశ్వంతరావుపేట, తండా, మన్నెవారి జలాల్పూర్, తండా, దామరంచ, అక్కమ్మపల్లి, ధర్మారం, అందుగులపల్లి, మహ్మద్నగర్తండా, మానేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
వెల్దుర్తి, నవంబర్ 8: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ సర్కా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం వెల్దుర్తి మండలంలోని యశ్వంతరావుపేట, తండా, మన్నెవారి జలాల్పూర్, తండా, దామరంచ, అక్కమ్మపల్లి, ధర్మారం, అందుగులపల్లి, మహ్మద్నగర్ తండా, మానేపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి వారు మాట్లాడుతూ ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది, బంగారు తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సుపరిపాలనను అందిస్తుంటే, కాంగ్రెస్, బీజేపీలు సీమాంధ్ర పార్టీలు కుమ్మక్కై తెలంగాణను దోచుకోవడానికి చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే మధిర గ్రామాలతో పాటు తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని, గ్రామాలు, తండాలు అనే తేడా లేకుండా అన్ని దారులు సీసీ రోడ్లుగా మారాయన్నారు. వీటితోపాటు మురుగు కాల్వలు నిర్మించారన్నారు. పెన్షన్ల పెంపుతోపాటు ఉచిత విద్యుత్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హల్దీవాగులో ఎండాకాలంలోనూ నీళ్లు పారుతుంటే గోదావరి నదిలా కనిపిస్తున్నదన్నారు. ఎండాకాలంలో ఎలాం టి సాగునీటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో నేడు పంటలు పండించుకుంటున్నామన్నారు. అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా దళిత బంధుతోపాటు బీసీ బంధు, మైనార్టీ బంధు అందిస్తూ కులవృత్తులకు అండగా నిలుస్తున్నారన్నారు. నిరుపేదల విదేశీ విద్యకు రూ. 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించి, ఆదుకుంటున్నారన్నారు. పదేం డ్ల బీఆర్ఎస్ పాలనను, గతంలో ఉన్న ప్రతిపక్షాల పాలనను చూసి ఓట్లు వేయాలన్నారు. మారుమూల గ్రామాలు ఆదర్శంగా కావాలంటే, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి, కేసీఆర్ను సీఎం చేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీని అన్ని వర్గాలు ఆదరిస్తున్నాయని, రెండు పర్యాయాలు నియోజకవర్గ ప్రజలు ఓట్లు వేసి తనను గెలిపించారని, వారికి అన్ని వేళలా అం డగా ఉంటూ అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే చిలుము ల మదన్రెడ్డి అన్నారు. ఇప్పుడు సునీతాలక్ష్మారెడ్డితో కలిసి మరోసారి ప్రజల ముందుకు వస్తున్నామని, ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో అభివృద్ధి సాధ్యమవుతుందని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో వారికే సఖ్యత లేదని, ఇరు పార్టీల్లో నాయకత్వ లోపం కనిపిస్తున్నదన్నారు. టికెట్ల కోసం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారని, సఖ్యత లేనప్పుడు వారు ఎలా అభివృద్ధి చేస్తారన్నారు. ప్రతిపక్షాలు గతంలో ఇవ్వని వాటిని నేడు ఇస్తామంటూ, సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. నిరంతరం ప్రజల కోసం, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఎన్నుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని, సునీతాలక్ష్మారెడ్డి గెలుపు ఖాయమని, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటూ కూర్చొవాలన్నారు.
మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో ప్రచారం అనంతరం వెళ్తున్న సునీతాలక్ష్మారెడ్డిని కలువాల ని వృద్ధులు, స్థానిక నాయకులను కోరారు. వారు ఈ విషయాన్ని సునీతాలక్ష్మారెడ్డికి తెలుపగా వారి వద్దకు వచ్చిన ఆమె వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ.. అవ్వా పింఛన్ వస్తున్నదా.. ఊర్లో అన్ని సీసీ రోడ్లు అయ్యాయా అని అడిగారు. దీంతో వారు ప్రతి నెలా పింఛన్ ఠంచన్గా వస్తున్నదని, ఆ సారు సల్లంగుండాలని చేతులెత్తి సీఎం కేసీఆర్కు నమస్కారం చేశారు. ఇలాంటి అనేక పనులు చేసుకోవాలంటే కారు గుర్తుకు ఓటు వేసి, తనను గెలిపించాలని సునీతాలక్ష్మారెడ్డి కోరారు. పనులు మంచిగా అవుతున్నయని, కారు గుర్తుకే ఓటేస్తామని వృద్ధులు తెలిపారు.
మన్నెవారి జలాల్పూర్తండాకు రాగానే గిరిజన మహిళలు తమ సాంప్రదాయ దుస్తులను సునీతాలక్ష్మారెడ్డికి ఇచ్చారు. వారిని అలంకరించిన సునీతారెడ్డి వారితో కలిసి మాట్లాడి, వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పలు పనులను సునీతారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళతో కలిసి సేవాలాల్, భవానీ మాత దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, పూర్ణాహుతి నిర్వహించారు.
మండలంలోని అందుగులపల్లి, మహ్మద్నగర్ తండాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకు లు సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులా బీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీల నాయకులు చేరుతున్నారని, వారికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా నిలుస్తుందన్నారు.
నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రచారం సందర్భంగా గ్రామగ్రామాన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్లుతో పటాకులు కాల్చుతూ, జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను ఆసక్తిగా చూస్తూ, ప్రసంగాలు విన్నారు. దామరంచలో వృద్ధుడు ర్యాలీ సందర్భంగా కర్రతో నృత్యం చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రచారంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, వెల్దుర్తి ఎంపీటీసీ మోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అశోక్రెడ్డి, నాయకులు రాజిరెడ్డి, నర్సింలు, గోపాల్రెడ్డి, కృష్ణాగౌడ్, రమేశ్చందర్, శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్గుప్తా, కృష్ణ, యాదాగౌడ్, ఖాజా, దుర్గారెడ్డి, అశోక్గౌడ్, శాఖారం శ్రీను, గంగాధర్, శ్రవణ్, వెంకటేశం, శ్రీధర్రెడ్డి, సత్యనారాయణగౌడ్, సోమప్ప, రాజులు, సత్యంగౌడ్, వడ్ల నర్సింలు, మల్లేశంగౌడ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.