తొగుట, డిసెంబర్ 11: తెలంగాణ తరహా దేశాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారని మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం తొగుట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్తో కలిసి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణ కోసం సబ్బండవర్గాలను ఒక్క తాటిపై తెచ్చి, రాష్ట్ర కల సాకారం చేసుకున్నామన్నారు. దేశ రాజకీయల్లో కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. తన ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశంలోనే నెం.1గా నిలిపారని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
సేవా కార్యక్రమాలు అభినందనీయం..
మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, చేసిన సేవలే నిలిచిపోతాయని ఎంపీ అన్నారు. తొగుట మండల కేంద్రంలో కనకలక్ష్మి, ఫక్రొద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీజర్లను ఎమ్మెల్సీతో కలిసి ఎంపీ పంపిణీ చేశారు. ఫ్రీజర్ సౌకర్యం లేకపోవడంతో మండల ప్రజలు సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని, నేడు ఆ సమస్య తీరిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ తొగుటలో రెండు ఫ్రీజర్లను ఇచ్చారని, వాటి ని వినియోగించుకోవాలన్నారు.
భాస్కర్రెడ్డి దంపతులకు సన్మానం
అల్వాల బ్రిడ్జి పనులకు సహకారం అందిస్తున్న బాసిరెడ్డిగారి పద్మజ-భాస్కర్రెడ్డిని మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ సన్మానించారు. కాన్గల్లో బాసిరెడ్డి రాంభుపాల్రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్కి వెంకటయ్య, దుబ్బాక నియోజకవర్గ అత్మకమిటీ చైర్మన్ భాస్కరచారి, మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దొమల కొమురయ్య పాల్గొన్నారు.