పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 27: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, బీఆర్ఎస్ పట్టణ నాయకులతో కలిసి సోమవారం జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించి 26 ఏండ్లు పూర్తి చేసుకుందన్నారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి పోయిందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, అంజయ్యయాదవ్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, గూడెం మధుసూదన్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీకాంత్గౌడ్, నర్రా భిక్షపతి, రాజ్కుమార్, యువనేత పృథ్వీరాజ్, సురేందర్గౌడ్, ఎ.శ్రీనివాస్యాదవ్, సాయిచరణ్గౌడ్, సర్కి ల్ ప్రెసిడెంట్ పరమేశ్యాదవ్, సర్కిల్ మహి ళా అధ్యక్షురాలు రాణియాదవ్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గోవింద్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.