సంగారెడ్డి, అక్టోబర్ 24: సంగారెడ్డి గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని, నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. దసరా తర్వాత నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమానికి నారాయణఖేడ్ వెళ్తున్న మంత్రి హరీశ్రావు మార్గమధ్యంలో డీసీసీబీ వైస్చైర్మన్ పట్నం మాణిక్యమ్ ఇంటికి రావడంతో మంత్రికి మాణిక్యమ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పట్నం మాణిక్యం నివాసంలో మీడియా సమావేశం ఏర్పా టు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నారాయణఖేడ్లో నిర్వహిస్తున్న అలయ్బలయ్ కార్యక్రమానికి వెళుతూ మధ్యలో పట్నం మాణిక్యమ్ నివాసానికి వచ్చి కుటుంబసభ్యులతో కలిసి చర్చలు జరిపి పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు.
ఈసారి శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని మాణిక్యమ్, తన అనుచరులతో పనిచేసి అభ్యర్థి విజయానికి కృషి చేయాలన్నారు. కలిసికట్టుగా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేసి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నాయకుల సమన్వయంతో పనిచేస్తే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సాధ్యమవుతుందన్నారు. మాణిక్యమ్కు మంచి భవిష్యత్ ఉందని.. త్వరలో అధినేత దగ్గరుకు తీసుకెళ్లి పార్టీ గుర్తించి అండగా ఉంటుందని భరోసాఇచ్చా రు. అనంతరం మంత్రి పట్నం మాణిక్యమ్ను తన వెం టా తీసుకెళ్లారు. మంత్రికి దసరా శుభాకాంక్షలు తెలిపిన వారిలో సంగారెడ్డి అభ్యర్థి చింతా ప్రభాకర్, నాయకులు మామిళ్ల రాజేందర్, ఎంఏ ముఖీమ్ తదితరులు ఉన్నారు.