న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై సోమవారం రష్యా జరిపిన దాడిలో నలుగురు భారతీయులు మరణించారు. ఒడెసా పోర్టు(Odesa Port) లోని నౌకపై రష్యా క్షిపణులతో విరుచకుపడింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో నలుగురు భారతీయులే ఉన్నారు.ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం రష్యా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్కు సమన్లు జారీ చేశారు. భారతీయ నావికుల్లో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నలుగురు భారతీయుల మృతికి కారణమైన రష్యా దాడిన ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ఆదివారం ఎమ్వీ గోల్డెన్ లియో (MV Golden Leo) అనే నౌక 17 మంది సిబ్బందితో ఒడెసా పోర్టు నుంచి బయల్దేరింది. ఈ నౌకపై రష్యా దాడి చేయడంతో పది మంది చనిపోయారని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. వాణిజ్య పడవలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరులను చంపడం సమంజసం కాదని.. అలాంటప్పుడు జల స్వేచ్ఛ రవాణా, వాణిజ్యంను నిలిపివేయాలని రష్యాను కోరింది.
టర్కీకి చెందిన కార్గో నౌక గోల్డెన్ లియాపై దాడి జరిగింది. కేహెచ్-59-కేహెచ్ 69 రకం క్రూయిజ్ క్షిపణులతో రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్చెప్పింది.వీటిల్లో ఓ క్షిపణి.. గోల్డెన్ లియోను ఢీకొన్నట్లు తెలిసింది.