Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టి రెండున్నరేండ్లు అవుతున్నా ఆయన పేరును క్యాబినెట్ మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు సైతం మర్చిపోతున్నారు. ఎక్కడైనా ప్రైవేటు, వ్యక్తిగత కార్యక్రమాల్లో మర్చిపోతే ఓకే గానీ, బహిరంగసభల్లో, అధికారిక ప్రెస్మీట్లలోనే సీఎంగా రేవంత్రెడ్డి పేరు పలుకలేకపోతున్నారు. నిత్యం కలిసి ఉండే క్యాబినెట్ మినిస్టర్, సొంత జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పేరు సంబోధించడంలో తడబాటుకు గురవుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పేరును తడబడి మర్చిపోయాడు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ..గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ శీనన్నను సీఎంను చేసి వెంటనే తన తప్పును సరి చేసుకున్నాడు. కాంగ్రెస్ మంత్రులకు, సీనియర్ నేతలకు కూడా సీఎం ఎవరో తెలియదా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
గౌరవ ముఖ్యమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ శీనన్నను సీఎంను చేసిన రామ్మోహన్ రెడ్డి https://t.co/d1kiADvCUh pic.twitter.com/0Qn6CWIO4S
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026