పటాన్చెరు, మే 6: కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పార్టీ శ్రేణులను కోరారు. సోమవారం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హరీశ్రావు హాజరై పలు సూచనలు చేశారు. బుధవారం పటాన్చెరు పట్టణంలో కేసీఆర్ రోడ్షోను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మార్గదర్శనంలో విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. ప్రతిరోజూ ఇంటింటికెళ్లి ప్రచారం చేయాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీల నుంచి ప్రజలను రోడ్ షోకు హాజరయ్యేలా చూడాలన్నారు.
బీఆర్ఎస్కు పెద్దస్థాయిలో ఆదరణ ఉన్నన్నారు. పార్టీకి కంచుకోట పటాన్చెరు అని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్ రోడ్ షో ఉంటుందన్నారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీలు గడీల శ్రీకాంత్గౌడ్, కొలన్ బాల్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ ఈర్ల దేవానంద్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్కుమార్, శ్రీధర్చారి తదితరులు పాల్గొన్నారు.