సిద్దిపేట, మార్చి 23: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. దీనికోసం ఈనెల 26 నుంచి మెక్ మెందపార్లట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
26న ఉదయం 11గంటలకు సంగారెడ్డి నియోజకవర్గం, సాయంత్రం 5గంటలకు మెదక్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. 28న ఉదయం 11గంటలకు సిద్దిపేట, సాయంత్రం 5గంటలకు నర్సాపూర్, 28న సాయంత్రం పటాన్చెరు, 29న ఉదయం 11గంటలకు దుబ్బాక, 30వ తేదీన 11గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.