మెదక్, మే 6(నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మెదక్కు బీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ రానున్నారు. కేసీఆర్ రాక కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షోలో ప్రజలు, యువకులు, రైతులు భారీగా తరలివస్తున్నారు. జనవాహినితో రోడ్లన్నీ జనమయం కావడంతో పాటు కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వినేందుకు పెద్దసంఖ్యలో తరలిరానున్నారు. మెతుకుసీమ ప్రజలంతా కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. రోడ్షో, బస్సుయాత్రలో భాగంగా రాత్రి 8.30గంటలకు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, నాయకులు రానున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దసంఖ్యలో జనాన్ని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.