24 గంటల కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తారో, 3 గంటల కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్కు ఓటేస్తారో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఆగం కావొద్దు.. ఆలోచించి ఓటు వేయాలి. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజలంతా ఆగమైపోతారు. ఆ పార్టీకి ప్రజలపై చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి అంటే ఏమిటో తెలియని కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవు. బర్రె తెల్వది గొర్రె తెల్వది.. ఎద్దు తెల్వది ఎవుసం తెల్వది.. చేను తెల్వది చెల్క తెల్వని రోహిత్కు బతుకమ్మ ఆట.. బతుకమ్మ చీరలపై వెటకారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు’..అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
నిజాంపేట/చిన్నశంకరంపేట, నవంబర్ 26: అన్నదాతలు ఆర్థికంగా బలపడాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు అందిస్తుంటే.. రేవంత్రెడ్డి 3 గంటలిస్తే ముంగట పడుతమా.. అని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేటతోపాటు మండలంలోని కల్వకుంట, నార్లపూర్, చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని ఎస్.కొండాపూర్, గజగట్లపల్లి, ఎస్.కొండాపూర్ గిరిజన తండాలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలో గ్రామగ్రామాన పద్మాదేవేందర్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చిన్నశంకరంపేటతోపాటు గజగట్లపల్లి, ఎస్.కొండాపూర్ గ్రామాల్లో బోనాలు బతుకమ్మలు, పోతరాజుల విన్యాసాలు, మంగళ హారతులతో పూలవర్షం కురిపించారు. పటాకులు కాలుస్తూ డప్పుచప్పుళ్లతో, మహిళలు బొట్టుపెట్టి ఘనంగా స్వాగతం పలికారు. చిన్నశంకరంపేట బస్టాండ్ నుంచి శ్రీ సోమేశ్వర ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
దర్గా వద్ద పద్మాదేవేందర్రెడ్డి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, అభివృద్ధి అంటే ఏమిటో తెలియని కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుతో పంట పెట్టుబడి సాయాన్ని నేటి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు నాడు సీఎం కేసీఆర్, మేమందతా జై తెలంగాణ అంటే మైనంపల్లి నై తెలంగాణ అన్నాడన్నారు. ప్రశాంతంగా ఉన్న మెదక్ నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు ఓటు రూపంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి మెదక్ నియోజకవర్గానికి ఏంచేశాడో చెప్పాలన్నారు.
రామాయంపేట రూరల్, నవంబర్ 26 : మీ ఇంటి కోడలిని మీ బిడ్డగా ఆశీర్వదించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు మరింత సేవ చేస్తానని బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోనాపూర్ గ్రామంలో ప్రచారం చేశారు. ఎంపీపీ భిక్షపతి, సర్పంచ్ దోమ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, 93 లక్షల మందికి రైతుబీమా తరహా ఇంటింటికీ బీమా కేసీఆర్ ధీమా, తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. బర్రె తెల్వది గొర్రె తెల్వది.. ఎద్దు తెల్వది ఎవుసం తెల్వది.. చేను తెల్వది చెల్క తెల్వని రోహిత్కు బతుకమ్మ ఆట.. బతుకమ్మ చీరలపై వెటకారంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని మండిపడ్డారు. నిజాంపేట మండలానికి పీహెచ్సీ మంజూరైందని, నిజాంపేట అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం నిజాంపేట, నస్కల్ గ్రామానికి చెందిన 17 మంది ఎంఎస్ఎస్వో ట్రస్టు సభ్యులు పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో నిర్వహించిన ప్రచారంలో బీఆర్ఎస్ జిల్లా ఎన్నికల ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏకే గంగాధర్రావు మ్యాడం బాలకృష్ణ, ఎంపీపీ సిద్ధిరాములు,
వైస్ ఎంపీపీ అందె ఇందిరా కొండల్రెడ్డి, జడ్పీటీసీ పట్లోరి మాధవి, మండల రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పీహెచ్ రమణ, మండల ఇన్చార్జులు వేణుగోపాల్రెడ్డి, రమేశ్గౌడ్, మాజీ జడ్పీటీసీ విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు రాజు, మండల సర్పంచ్లు అనూష, కవిత, చంద్రవర్ధిని, అరుణ్కుమార్, గేమ్సింగ్, నర్సింహారెడ్డి, అనిల్కుమార్, అమర్సేనారెడ్డి, ఎంపీటీసీలు లహరి, బాల్రెడ్డి, సురేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గౌస్, కల్వకుంట, పార్టీ మండల అధ్యక్షుడు రాజు, సర్పంచ్లు మీనా, శశిరేఖ శ్రీనివాస్రెడ్డి, పూలపల్లి యాదగిరియాదవ్, దయానంద్యాదవ్, భిక్షపతిగౌడ్, ఎంపీటీసీలు రాధిక కుమార్గౌడ్, మాజీ ఎంపీటీసీ హేమవెంకటేశం, హేమచంద్రం, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు అందె కొండల్రెడ్డి, బాపురెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ భాస్కర్రావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అబ్దుల్ ఆజీజ్, మాజీ ఎంపీపీ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవి, ఏఎంసీ డైరెక్టర్ లతీఫ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.