సిద్దిపేట, మార్చి 27: నిండు మనస్సుతో ఆశీర్వదించండి… మీలో ఒకరినై సేవకుడిగా పని చేస్తానని మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశంలో మాజీమంత్రి హరీశ్రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్హుస్సేన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యల మీద లోతైన అవగాహన ఉందని, మెరుగైన పనితీరుతోనే ఇకడే పీడీగా, జాయింట్ కలెక్టర్గా, కలెక్టర్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పని చేశానన్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో ప్రతిసారి బీఆర్ఎస్ జెండా ఎగురుతూ వచ్చిందని, ఈ ప్రాంతంలో సుశిక్షితులైన, కరుడుగట్టిన నిస్వార్థమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండటం నా అదృష్టం అన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా మెదక్ పార్లమెంటు పరిధిలో గులాబీ హవా కొనసాగిందన్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అన్నారు. ఆస్తులు, అంతస్తుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయిలో ప్రజాసేవ చేయడానికి వచ్చానన్నారు. ప్రజా సమస్యల పరిషారంలో దీక్షాదక్షత కలిగిన కేసీఆర్, హరీశ్రావు పర్యవేక్షణలో పనిచేయడం వల్లనే ఒక అధికారిగా ప్రజల మన్ననలు పొందగలిగానని చెప్పారు. అనంతరం హరీశ్కావు మాట్లాడుతూ ఎంపీ ఎన్నకల సన్నాహక సమావేశం శుక్రవారం మధ్యా హ్నం 12గంటలకు సిద్దిపేటలోని కొండమల్లయ్య గార్డెన్లో 3వేల మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, విద్యార్థులు, యువత ఇతర గ్రామస్థాయి అనుబంధ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.