Swachh Bharat | చిలిపిచెడ్, సెప్టెంబర్ 20 : చిలిపిచెడ్ మండలంలోని అజ్జమర్రిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సందర్భంగా శనివారం సేవాపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అజ్జమర్రి 143 బూత్ అధ్యక్షుడు బాయికాడి అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారంతా కలిసి చీపురు పట్టి రోడ్డును శుభ్రం చేశారు. రోడ్డు పక్కనే ఉన్న పిచ్చి మొక్కలను ఏరివేశారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. తద్వారా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చిలిపిచెడ్ మండల బీజేపీ అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మండల ప్రధాన కార్యదర్శులు కొర్పోల్ సత్యనారాయణ, లస్కరి వెంకటేశం మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, జిల్లా నాయకుడు శ్రీనివాస్, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు బిక్షపతి శ్రీనివాస్ యాదవ్, మండల సీనియర్ నాయకులు దశరథ్, లక్ష్మణ్, గాదే బాబు, యాదగిరి, మల్కయ్య, నరసింహ గౌడ్, శేఖర్, బీరప్ప, ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Swachh Bharat