చేర్యాల, ఫిబ్రవరి 14: సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్యాదవ్ గురువారం పర్యటించనున్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మల్లన్న క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్(హాల్ట్) నిర్మాణ పనులకు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కలిసి వారు భూమిపూజ చేయనున్నారు. కొమురవెల్లి ఆలయానికి వచ్చే రహదారి పక్కన రైల్వేస్టేషన్ నిర్మాణానికి సంబంధిత అధికారులు ఇటీవల స్థలాన్ని ఎంపిక చేశారు.
దీంతోపాటు భూమిపూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భూమిని చదును చేసి శిలాఫలకం తదితర పనులు పూర్తి చేశారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉన్న కొమురవెల్లి క్షేత్రానికి ఇక రైల్వేస్టేషన్ రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమిపూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.