రామాయంపేట, అక్టోబర్ 10: తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మి దేళ్ల కాలంగా పల్లెల్లో, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన సర్కారీ వైద్య సేవలను అందిస్తుంది. గత సమైఖ్య పాలనలో ప్రభు త్వాల పుణ్యమా అని గ్రామాల్లో సరైన సర్కారీ వైద్య సేవలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభు త్వ ఏర్పాటుతో పల్లెలను, గిరిజన తండాలకు మరింత మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో ప్రతి తండా లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలతోపాటు పశువులకు సైతం ఎప్పటికప్పుడు వైద్య సేవలను అందేలా పటిష్టమైన చర్యలు చేప ట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సిబ్బందిని అప్రమత్తం చేసి పల్లె స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైద్యులంతా పల్లెబాట పట్టారు. వైద్యులు సైతం ప్రతి గ్రామాన్ని విడిచి పెట్టకుండా గ్రామాల్లో రైతుల తో, గ్రామస్తులతో సమావేశాలను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై సూచనలు, సలహాలు అవగాహన కల్పిస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రతి రోజు ఏదో ఒక గ్రామానికి వెళ్లి అక్కడ శిబిరం ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు టీకాలు వేస్తున్నారు. ప్రతి నెల గిరిజన ప్రాంతాలకు, పల్లెలకు వెళ్లి వైద్య సేవలను అందిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, వైద్యసిబ్బంది మారుమూల గ్రామాలపై ప్రత్యేక దృష్టిని పెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సేవలు కల్పిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మండల స్థాయి అధికారులకు ప్రతి సీజన్లో మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి సేవలందించాలో పైస్థాయి అధికారులు క్రింది స్థాయి సిబ్బందికి సూచనలు సలహాలిస్తున్నారు దీంతో ప్రభుత్వ సిబ్బంది పల్లెబాట పట్టి ప్రజలకు సేవలందిస్తున్నారు. అన్ని శాఖల సిబ్బంది సంయుక్తంగా గ్రామాల్లోని పారిశుధ్యంపై ప్రధా న దృష్టి పెట్టి ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఎప్పటి కప్పుడు చర్యలను చేపడుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో మెరుగైన సర్కార్ వైద్యం ప్రజలకు అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుం టుంది.
గత నెలరోజులుగా మండల స్థాయి వైద్య సిబ్బంది సంయుక్తంగా రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు అనారోగ్యాలకు గురికాకుండా ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై సూచనలిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి ముందర చెత్తాచెదారం, కుళా యిలలో ఉన్న నీటి నిల్వలను పలు చోట్ల అధికారులే స్వయంగా వెళ్లి శుభ్రం చేస్తున్నారు. నీటి నిల్వలతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ఎక్కువ శాతం మంది చిన్నపిల్లలు పెద్దలు అనారోగ్యాలకు గురికా వాల్సి వస్తుందని, అందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని గ్రామీ ణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో గ్రామాల్లో అధికారుల పనితీరుకు ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాడిపశువులకు వైద్య శిబిరాలు
రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు, మేకలు, పాడిగేదెలకు సైతం ప్రభు త్వం శిబిరాలను ఏర్పాటు చేసి సర్కారు వైద్యం అందజేస్తున్నా రు. గ్రామీణ ప్రాంతాల్లో పాడిపశువులకు, జీవాలకు పశు వైద్యు లు అటవీ ప్రాంతంలో ఉండే జీవాలకు నట్టల నివారణ, చిట్కు వ్యాధి తదితర రోగాలకుగాను పశువులకు నివారణ వైద్యాన్ని అందిస్తున్నారు. సబ్సిడీపై పాడి గేదెలను, గొర్ల కాపర్లకు సబ్సి డీపై గొర్రెలను అందించి నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పశువులను నిర్లక్ష్యం చేయొద్దు
పశువుల పట్ల రైతులు నిర్లక్ష్యం గా ఉండవద్దు. సాయంకాలం సమయంలో పశువులు ఇంటికి రాగానే వాటిని శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఎందుకంటే పాడి గేదెలు పాలు ఇస్తాయి. కనుక వాటి చర్మం శుభ్రంగా ఉండేవిధంగా రైతులు చూసుకోవాలి. పశువుల వద్ద కొట్టంలోకి దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్తలను తగిన పాటించాలి. గొర్లు, మేకలకు వ్యాధుల నివారణకు ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలి.
– శ్రీనువాస్, రామాయంపేట పశు వైద్యులు
వేడినీటిని తాగాలి
మన చుట్టూ ఉన్న పరిసరాలు పరి శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి. మనం తినే అహారంతో పాటు ప్రతి నిత్యం వాడుకునే నీటిని సైతం కలుషితం కాని మంటినీటినివాడితే రోగా లు రావు. వర్షపు నీటివల్ల ఎక్కువ శాతం దోమలు, ఈగలు వృద్ధిచెందే అవకాశం ఉంది. అందుకోసం ప్రతి రోజు వేడినీటినే తాగాలి. రక్షత మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేగా చర్యలను చేపట్టాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరింత కృషి చేస్తాం.
– హరిప్రియ, డి.ధర్మారం ప్రభుత్వ వైద్యురాలు