పటాన్చెరు, అక్టోబర్ 24: పటాన్చెరు డివిజన్ 113లోని బండ్లగూడలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జరిగిన అభివృద్ధిని చూపి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వారిని ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. బండ్లగూడ గ్రామం ఒకప్పుడు వెనుకబడి ఉన్నదని, బీఆర్ఎస్ సర్కారు నుంచి భారీగా నిధులు రావడంతో బండ్లగూడ అభివృద్ధిలో ఇప్పుడు ముందున్నదన్నారు.
తాగునీరు, సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీల సౌకర్యం కల్పించామన్నారు. బస్తీ దవాఖానలతో సామాన్యులకు వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పింఛన్లు, బీసీ బంధు, మైనార్టీ బంధు పథకాలతో ఆర్థిక సాయం అందజేశామన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. బీఆర్ఎస్లో యువకులకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చక్కటి అభివృద్ధి చేశారని కొనియాడారు. మరోమారు బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బీజేపీ సీనియర్ నాయకుడు రాజు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరియాదవ్, శివ, చందు, ఆసీఫ్, మాజీ ఎంపీపీ శ్రీశైలంయాదవ్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు అఫ్జల్, బండ్లగూడ అధ్యక్షుడు గోపాల్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.