సంగారెడ్డి, జనవరి 31: అవకాడో పండు ఎంతో విశిష్టమైనదని, అధిక దిగుబడులకు ఉత్తమమైన మేలు రకం పంట అని కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఫలపరిశోధన కేంద్రంలో అవకాడో సాగుపై అనుభవం కలిగిన రైతు లు, వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు వివిధ ప్రాంతాల అన్నదాతలు తరలివచ్చి అవకాడోపై శాస్త్రవేత్తలు, రైతుల అనుభావాలను తిలకించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు మేలు రకాలకు చెందిన పండ్లను పండించి అధిక లాభా లు సాధించాలన్నారు.
నేటి సమాజంలో ఏ పండు తింటే ఏమవుతుందోనని, ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఎలాం టి నష్టం కలిగించకుండా అధిక పోషకాలు అందించే అవకాడోను తీసుకోవాలన్నారు. ఇందులో ఎక్కువగా ఏ,సీ,ఈ విటమిన్లతో పాటు పోషక, పీచు పదార్థా లు అధికంగా ఉంటాయన్నారు. జా మ అకారంతో పెద్దాగా ఉండే అవకాడో మా నవ శారీరానికి అన్ని రకాలుగా మే లు చేస్తుందన్నారు. పూత దశలో పంటలకు కొన్ని చీడ, పీడల నుంచి రక్షించుకునేందుకు వ్యవసాయ అధికారులు సూచన లు, సలహాలు పాటించి సస్యరక్షణ చర్య లు తీసుకుంటే పంట దిగుబడి అధికంగా వస్తుందన్నారు. వంద సంవత్సరాల ముందు నుంచి అవకాడో పంట పరిచ యం ఉందని, ఇందులో మోనోఅనే సేచురేటర్ కొవ్వులు అధికంగా ఉంటాయన్నారు. 5 ఏండ్లలో పంట ఎదుగుతుందని, అవకాడో గుండెపోటును తగ్గిస్తుందన్నారు. అరటిలో కన్నా అధిక పొ టాషియం ఉంటుందన్నారు. ఈ పం టను సాగు చేసేందుకు అన్నదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవకాడో అభివృద్ధికి ఫలపరిశోధన కేం ద్రం కృషి చేసి రైతులకు సలహాలు, సూ చనలు ఇవ్వాలని కోరారు. సదస్సులో కరుణాకర్, రాజ్కుమార్, టీవీఎస్ఎన్ వీర అరసు, శ్రీనివాస్రావు, బాబు, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి సునీత, నిఖిల్ అరోరా, పవన్కుమార్, ప్రసాద్, వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థినీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.