ములుగు, మార్చి 22: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేం ద్రం నూతన డీన్గా డాక్టర్ ఎస్జే ఆశను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసేంది. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. అధ్యాపక బృందం ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికారు. తనపై నమ్మకంతో డీన్గా బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు, నూతన పరిశోధనలకు తనవంతుగా కృషిచేస్తానని తెలిపారు.