మెదక్ మున్సిపాలిటీ/ మెదక్రూరల్/ నర్సాపూర్/ నిజాం పేట/ చిలిపిచెడ్, సెప్టెంబర్ 16 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మట్టి గణనాథులను ప్రతిష్ఠించి పూ జించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపుని చ్చారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మట్టి విత్తన గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించుకుంటే కులవృత్తిపై ఆధారపడిన కుమ్మరులకు ఉపాధి లభిస్తుందన్నారు.
మెదక్ నియోజకవర్గ వ్యాప్తం గా పది వేల విత్తన మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, బీఆర్ఎస్ చిన్న శంకరంపేట మండలాధ్యక్షుడు రాజు, కల్వకుంట సొసైటీ చైర్మన్ కొండల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చింతల నర్సిం హులు, స్వామి, కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యాసంస్థల్లో మట్టి వినాయకుల పంపిణీ
జిల్లాకేంద్రంలోని సిద్దార్థ్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్చౌదరి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లా స్టర్ ఆఫ్ ఫారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలు పూజించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులు
మెదక్ మండలం గుట్టకిందిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టివినాయక విగ్రహాలను తయారు చేశారు. ఉపాధ్యాయులు సంతోష్కుమార్, స్రవంతి మట్టి విగ్రహాల ఉపయోగం, పర్యావరణ పరిరక్షణ వివరించారు.
మట్టి విగ్రహాలతో పర్యావరణానికి మేలు
* జూనియర్ సివిల్ న్యాయమూర్తి అనిత
మట్టితో తయారు చేసిన వినాయకులతో పర్యావరణానికి ఎంతో మేలని జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. నర్సా పూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి అనిత మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చట్టాలపైన అవగాహన ఉండాలన్నారు. ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కెమికల్స్ లేని మట్టి వినాయకులను ప్రతిష్ఠించి, పూజించాలని సూచించారు. ఎస్బీఐ మేనేజర్ నర్సయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధిని పొందడానికి రుణాలు ఇస్తామన్నారు.
సమావేశం అనంతరం అధికారులు, కోర్టు సిబ్బంది, ప్రజలకు హెచ్హెండీఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నర్సాపూర్ ఆధ్వర్యం లో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏజీపీ సత్యనారాయణ, డిఫ్యూటీ తహసీల్దార్ ఆదర్శ్కుమార్, ఎస్సై శివకుమార్, ఎస్బీఐ మేనేజర్ సునీల్గాంధీ, ఎఫ్ఆర్వో అంబర్సింగ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
పాఠశాలలో వినాయక చవితి వేడుకలు
నిజాంపేట మండలంలోని చల్మెడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మట్టితో వినాయకుడి ప్రతిమలను తయారు చేశారు. పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ పారిస్)తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికే విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించామని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తెలిపారు.
చిలిపిచెడ్లో మట్టి విగ్రహాల పంపిణీ
చిలిపిచెడ్ మండలకేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, సర్పంచ్ లక్ష్మీదుర్గారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు మట్టి వినాయకులను పూజించాల న్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కృష్ణ, వార్డు సభ్యులు రామకృష్టయ్య, శ్రీకాంత్ పాల్గొన్నారు.