మెదక్ మున్సిపాలిటీ/చిన్నశంకరంపేట, నవంబర్ 24: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 4, 11, 12, 18వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆయా వార్డుల కౌన్సిలర్లు నర్మద యాదవ్, సమీయొద్దీన్, సులోచనలతో కలిసి పద్మారెడ్డి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అన్ని రంగాల్లో మెదక్ను అభివృద్ధి చేస్తానని, ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించి మళ్లీ గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో మాజీ మున్సిపల్ వైస్చైర్మన్ రాగి అశోక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు ప్రభురెడ్డి, శ్రీధర్యాదవ్, మధుసూదన్రావు, దుర్గప్రసాద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేట మండలం భాగీర్థిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు, గౌడ సంఘం సభ్యులు శుక్రవారం సూరారంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ నాయకులు వెంకటేశ్, సత్యనారాయణ, మహేశ్, రాజు, బాబు పర్వతాలు, గౌడ సంఘం సభ్యులకు పద్మాదేవేందర్రెడ్డి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకులను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు. పద్మాదేవేందర్రెడ్డి విజయం కోసం తమ వంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధర్రావు, మ్యాడం బాలకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ రమణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, సర్పంచ్ దయానంద్, ఎంపీటీసీ అనురాధ, సింగిల్విండో చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.