మెదక్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : భూమ్మీద మానవుడి తోపాటు సహజీవనం చేస్తున్న జంతువుల పట్ల కరుణ చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జంతువుల రక్షణతోపాటు వాటి పరిరక్షణకు ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చిందన్నారు. జంతువులను హింసించినా, చం పినా శిక్షార్హులని హెచ్చరించారు. శుక్రవారం తన కార్యాలయంలో జంతు సంక్షేమంపై పశుసంవర్ధకశాఖ ముద్రించిన కరపత్రాన్ని జిల్లాధికారి విజయశేఖర్రెడ్డితో కలిసి ఆవిషరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మనిషి తన అవసరాలకు అనుగుణంగా అడవులు, కొండలు, కొండలు, నదులు, సరస్సులను ఆక్రమించుకోవడంతో కాలక్రమేణా అనేక జంతు, వృక్ష జాతు లు అంతరించాయన్నారు. భూమిపై ప్రతి ప్రాణి ప్రకృతిలోని సమస్థితిని కాపాడుతుందని తెలిపారు. వృక్ష, జంతు జాతుల పరి రక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. జంతువులు, పక్షులతోపాటు నీటి లో జీవించే జలచరాలను హింసించినా హాని కలిగించినా జంతు సంక్షేమ బోర్డు శిక్షిస్తుందని హెచ్చరించారు. ప్రతి పౌ రుడు జంతు సంరక్షణకు పాటుపడాలని, వాటిపట్ల కరుణ చూపాలని, ఆహారం, తాగునీరు అందించాలని సూచించా రు. కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకు డు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ జానకీరాంసాగర్, మున్సిపల్ ఇంజినీర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.