మెదక్ అర్బన్, జూన్ 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 4,49,680 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 2,13,976 పురుషులకు, మహిళలకు 2,35,704 ఉన్నారు. ఇప్పటివరకు 41331 మందికి కండ్ల అద్దాలను పంపిణీ చేశారు.
మరో 41,704 మంది కండ్ల అద్దాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. పట్టణంలో శుక్రవారం 95వ రోజు రెండు బృందాలు 407 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 334 మందికి కండ్ల అద్దాలను పంపిణీ చేశారు.