బొల్లారం, మే 4 : పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు సజీవ దహనం కాగా, మరో ముగ్గురు కార్మికులకు తీవ్రంగా గాయాలైన సంఘటన బుధవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలోని మీనాక్షి స్మల్టర్, అండ్ రోలర్స్ ఐరన్ పరిశ్రమలో చోటుచేసుకుంది. బొల్లారం సీఐ సురేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఐరన్ పరిశ్రమలో బుధవారం ఉదయం 6గంట ల సమయంలో బాయిలర్లో ఇనుప రాడ్లను కరిగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆ సమయంలో అక్కడే కొంత దూరంలో విధులు నిర్వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన హిమ్మత్సింగ్ (30) అనే కార్మికుడు సజీవ దహనం కాగా, మరో ముగ్గురు కార్మికులు అజయ్కుమార్ (33), లాల్బీహారి కుమార్(22), అక్షయకుమార్(19) తీవ్రంగా గాయపడ్డారు. పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గాయపడ్డ కార్మికులు దవాఖానకు తరలింపు
పరిశ్రమలోని బాయిలర్ వద్ద జరిగిన పేలుడులో తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న బీహార్కు చెందిన ముగ్గు రు కార్మికులు అజయ్కుమార్, లాల్బిహారీ కుమార్, అక్షయ్కుమార్ను పోలీసులు హుటాహుటిన నిజాంపేట్లోని ప్రణ మ్ దవాఖానకు తరలించి వైద్య అందిస్తున్నారు. మృతుడు హిమ్మత్సింగ్ మృతదేహాన్ని పోలీసులు పటాన్చెరు ప్రభుత్వ దవఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పరిశ్రమను సందర్శించిన కార్మిక సంఘలా నాయకులు
మీనాక్షి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనను తెలుసుకు న్న స్థానిక నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి, కార్మిక సంఘం నాయకుడు వరప్రసాద్రెడ్డి, సంఘసేవకుడు ఆనంద్కృష్ణారెడ్డి పరిశ్రమను సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అం డగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చంద్రయ్య, నాయకులు శ్రీధర్రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు.
రూ. 20లక్షల నష్ట పరిహారం అందిస్తాం…
పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి యజమాన్యానిదే బా ధ్యత అని మున్సిపల్ కౌన్సిలర్లు, చంద్రారెడ్డి, చంద్రయ్య, కార్మిక నాయకుడు వరప్రసాద్రెడ్డి, సంఘ సేవకుడు ఆనంద్కృష్ణారెడ్డి, దీననాథ్ పేర్కొన్నారు. మృతి చెందిన, గాయపడిన కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని యాజమాన్యంతో చర్చలు జరిపారు. హిమ్మత్సింగ్ కుటుంబానికి నష్టపరిహారంగా రూ.20లక్షలు, చికిత్స పొందుతున్న కార్మికులకు వైద్యసహాయంతోపాటు ఇతర ఏదైనా నష్టం జరిగితే వారి కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున నష్ట పరిహారం అందిస్తామని పరిశ్రమ యాజమాన్యం అంగీకరించింది.