కంది, మార్చి 2: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ను అమెరికాకు చెందిన విద్యావేత్తల ప్రతినిధి బృందం శనివారం సం దర్శించింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్, ప్రొ ఫెసర్ మూర్తి ఆన్లైన్ మోడ్ ద్వారా యూఎస్ ప్రతినిధి బృందాన్ని స్వాగతించారు. యూఎస్-ఇండియా యూనివర్సిటీ భాగస్వామ్యాలను విస్తరించడం, పరిశోధన, ఉన్నత విద్య తదితర వాటిపై ప్రస్తావించారు. పరస్పర ఆస క్తి ఉన్న ప్రాంతంలో పరిశోధన సహకారం, ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడి, జాయింట్ సూ పర్వైజ్, జాయింట్ డిగ్రీ పోగ్రామ్లు, పరిశోధనలో పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతాన్ని గు ర్తించడం, పరస్పర వృద్ధి కోసం కన్సార్టియం మోడ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని సెట్ చేయడం, జాయింట్ వర్క్షాప్, వర్చువల్ బ్రెయిన్ స్టామింగ్ సెషన్, జాయింట్ రీసెర్చ్ తదితర ముఖ్య ఉద్దేశాలను యూఎస్ విద్యావేత్తల బృందం సభ్యులు వివరించారు.
అంతర్జాతీయ సంబంధాల డీన్ ప్రొఫెసర్ తరుణ్ కాంతి పాండా ఐఐహెచ్పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఐఐటీహెచ్ విశిష్టత, అకడమిక్, ఇండస్ట్రీ సహకారాలు, ఆస్ట్రేలియన్ విశ్వవిద్యాలయాలతో జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ల నిర్మాణం, సహకారాన్ని ఎలా విస్తరించాలనే దానిపై తన ఆలోచనలు పంచుకున్నారు. పరిశోధనలు, వృద్ధిని మెరుగుపర్చేందుకు ఐఐటీహెచ్ అధ్యాపకులు యూఎస్ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు ఆసక్తిని కనబర్చారు. కార్యక్రమంలో యూఎస్ ప్రతినిధుల బృందంతో పాటు ఐఐటీహెచ్ డీన్లు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.