సిద్దిపేట, మార్చి 8: శివుడి దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలని, రైతులు పాడిపంటలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట కోటిలింగాల ఆలయంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివుడికి ఆయన అభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ..
ఆ పరమశివుడి దయతో, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించుకున్నామని తెలిపారు. కాళేశ్వరం నీళ్లతో ఈ ప్రాంతంలో బంగారు పంటలు పండాలని, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానన్నారు. అనంతరం నారాయణరావుపేట మండలం బుగ్గరాజేశ్వరాలయాన్ని దర్శించుకుని హరీశ్రావు అభిషేకాలు చేశారు.