సిద్దిపేట నెట్వర్క్, అక్టోబర్ 4 : ‘తెలంగాణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం.. కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు గురుకులాల్లో విద్య, మిషన్ భగీరథ, కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవల వంటి ఎన్నో పథకాలు దేశంలో అమలు కావాలి’.. అని సబ్బండవర్ణాలు కోరుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతామని చెప్పడం ఆహ్వానించదగిన పరిణామమని, ఆయన దేశ ప్రధాని అయితే తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయని సంబురంగా చెబుతున్నారు.
విజయం వరిస్తుంది..
సీఎం కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లోనూ విజయం వరిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో జాతీయ పార్టీ దేశ వ్యాప్తంగా విజయకేతనం ఎగురవేస్తుందని నమ్మకం ఉంది. సీఎం కేసీఆర్ వెంటే మేమంతా నడుస్తాం. టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధించినట్టే దేశంలోనూ అన్ని వర్గాల కోసం సీఎం కేసీఆర్ పీఎం కావాలని కోరుకుంటున్నాం.
– వెంకటేశం, (సర్పంచ్, కోనాయిపల్లి)
నిరాటంకంగా విజయాలు
1983 నుంచి కేసీఆర్ వెంట ఉన్నాం. మొదటిసారి స్పల్ప మెజార్టీతో ఓడిపోయినప్పుడు బాధపడ్డాం. 1985లో కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో నామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేశారు. ఆ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలు పొందారు. అప్పటి నుంచి ఓటమి అనేది లేకుండా నిరాట ంకంగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో విజయం సాధిస్తారన్న విశ్వాసం ఉంది.
– నిమ్మ కిష్టారెడ్డి, కోనాయిపల్లి
విజయం సిద్ధిస్తుంది
వేంకటేశ్వర స్వామి దయతో సీఎం కేసీఆర్ సారు కచ్చితంగా గెలుస్తడు. ఆయన రావాలని ప్రజలంతా కోరుకుంటున్నరు. 45ఏండ్ల నుంచి ఈ గుడిలోనే పని చేస్తున్న. అందరికి మంచి పనులు చేసిండు. సారు ఇంకా ఎదగాలి. మా గుడిని పెద్దగా కట్టించుండు.
– రాజవ్వ, కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయ స్వీపర్
కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయం
1985లో మా తాత గూడెపు ఎల్లారెడ్డి అనే రైతుకు పాము కలలో వచ్చి పసరు చెట్టును వివిధ రోగాలను మందుగా పోయమని చెప్పింది. మా తాత బావి దగ్గరనే పసరు మందు పోసేవాడు. ఈ మందుకోసం మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పసరు మందు తాగేవారు. దీంతో పసరు మందు తాగే వారి కోసం టికెట్ను పెట్టడం జరిగింది. వచ్చిన పైసలతో కోనాయిపల్లిలోని పాత ఆలయాన్ని నిర్మిం చారు. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఆలయంగా మారింది. ప్రతి పనిని ఇక్కడే మొదలు పెట్టడంతో విజ యం సిద్ధిస్తున్నది. దీంతో కొత్త ఆలయాన్ని విశాలంగా నిర్మించారు. సంతోషంగా ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నాం.
– పెద్ది శ్రీకాంత్రెడ్డి, (కోనాయిపల్లి, గుడి నిర్మించిన వారి కుటుంబసభ్యుడు)
కేసీఆర్ వెంటే నడుస్తాం
సీఎం కేసీఆర్కు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహం మెండుగా ఉంది. సారుకు స్వామి ఆశీస్సులతో జాతీయ రాజకీయాల్లోనూ విజయం సాధిస్తారు. కోనాయిపల్లిలోని వెంకన్న స్వామి వారికి మొక్కి టీఆర్ఎస్ పెట్టి విజయం సాధించారు. అట్లనే సారు పెట్టే జాతీయ పార్టీ తప్పక విజయం సాధిస్తారు. సారు వెంటే మేం ఉంటాం.
– నిమ్మ శ్రీనివాస్రెడ్డి, గ్రామస్తుడు, కోనాయిపల్లి
సారు ప్రధాని అయితే సంతోషం
సీఎం కేసీఆర్ సారు వల్లే మా గుడిని పెద్దగా కట్టించారు. సారు వల్లే డెవలప్ అయింది. సారు ప్రధాని అయితే సంతోషం. సారు దేశ రాజకీయాల్లోనూ గెలుత్తడు. ఇంకా అభివృద్ధి పనులు ఎక్కువ చేసుకుంటం. అందరికి మేలు జరుగుతుంది. వెంకటేశ్వరస్వామి కృప సారుకు నిండుగా ఉంది.
– నిమ్మ అంజమ్మ, కోనాయిపల్లి, గ్రామస్తురాలు
పట్టుబడితే సాధించే దాకా వదలడు
సీఎం కేసీఆర్ పట్టుబడితే సాధించేదాకా వదలడు. ఒక్కసారి ఆయన అనుకుంటే అ పని అయ్యేదాకా వదిలిపెట్టడు. ధైర్యంగా పని చేస్తడు. అందరి మేలుకోసం అనేక పథకాలు తెచ్చిండు. ఈ పథకాలను దేశ ప్రజలందరికీ అందించాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లోకి వస్తుండు. సారు వెంటే నడుస్తాం. మా ఊరి వెంకటేశ్వరస్వామి కృపతో సారు విజయం సాధిస్తడు.
– రవీందర్రెడ్డి, కోనాయిపల్లి గ్రామస్తుడు
సీఎం కేసీఆర్తో అన్ని కులాల అభివృద్ధి
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నీళ్లను తెచ్చి అన్ని చెరువులను నింపిండు. దీంతో రైతులతోపాటు అందరికీ మేలు జరిగింది. మేం కూడా మా చెరువుల్లో చేపలు పెంచుకుంటున్నం. అన్ని కులాల కోసం కేసీఆర్ సారు పని చేస్తుండు. అందరికీ పింఛన్లు ఇచ్చిండు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలు చేసున్నారు.
సారుకు తిరుగు ఉండదు.
– పిల్లి దుర్గయ్య, ముదిరాజ్ కులస్తుడు, కోనాయిపల్లి
అందరికి మంచి జరుగుతుంది
సీఎం కేసీఆర్ పట్టుబడితే అయ్యేదాకా వదలడు. కచ్చితంగా దేశ ప్రధాని అయితడు. అన్ని కులాలకు మంచి జరుగుతుంది. మా గీత కార్మికులకు రూపాయి కూడా చెట్టు పన్ను లేకుండా చేసిండు. గీత కార్మికులకు 50ఏండ్లకు పింఛన్ ఇస్తుండు. ప్రధాని అయితే దేశంలోని పేదలందరికీ మంచి జరుగుతుంది. ప్రధాని కావాలని వేంకటేశ్వరుడిని కోరుకుంటున్న.
– బత్తిని శ్రీనివాస్గౌడ్, గీత కార్మికుడు, కోనాయిపల్లి
ఏడేండ్లుగా ఇక్కడే పూజలు చేస్తున్నాం
ఏడేండ్లుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని బనారస్ జిల్లాలోని ఘనావుహ మా ఊరు. అక్కడి నుంచి వచ్చినం. ఇక్కడి స్వామి వారి సన్నిధిలో పూజలు చేస్తూ ఉపాధి పొందుతున్నాం. గుడిని విశాలంగా కట్టించారు. సారుకు కృతజ్ఞతలు. దేవుడితో దయతో సారుకు మంచి జరగాలి. దేశ రాజకీయాల్లో రాణించాలి.
– వీణు త్రిపాఠి, కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి అర్చక కుటుంబసభ్యురాలు(యూపీ)