అందోల్, జూన్ 19: ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు విక్రయించినా, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసగించినా వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేయడంతోపాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని టాస్క్ఫోర్స్ అధికారి రామకృష్ణ హెచ్చరించారు. జోగిపేటలోని లక్ష్మీప్రసన్న, మన గ్రోమోర్ ఆగ్రో సేవాకేంద్రంతోపాటు పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో పోలీసులతో కలిసి టాస్క్ఫోర్స్ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టాంది. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దుకాణాల్లో సోదాలు చేపట్టినట్లు వివరించారు. దుకాణాల్లో విత్తన ప్యాకెట్లపై కంపెనీ పేరు, గడువు తేదీ, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులను పరిశీలించినట్లు తెలిపారు.
వ్యాపారులు విక్రయాలకు సంబంధించిన రికార్డులను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించారు. రైతులు ఎట్టి పరిస్థితిలో రసీదులు లేకుండా ఎరువులు కొనకూడదని కోరారు. ఎక్కడైనా అక్రమంగా ఎరువులు, విత్తనాలు నిల్వ చేసినా, విక్రయించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నకిలీలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని, వ్యాపారులు ఎట్టి పరిస్థితిలో నకిలీ విత్తనాలు విక్రయించడం, ఎక్కువ ధరకు అమ్మడం లాంటివి చేయకూడదని స్పష్టం చేశారు. రసీదుల్లో రాసిన ధరలే దుకాణాల్లోని ధరల పట్టికలో ఉండాలని చెప్పారు. దుకాణాదారులు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని రైతులకు సూచించారు. తనిఖీల్లో ఏడీఏ అరుణ, ఏవో విజయరత్న, ఏఈవోలు పాల్గొన్నారు.