చిన్నకోడూరు, డిసెంబర్ 31: రంగనాయక సాగర్కు మరింత పర్యాటక శోభరానున్నది. నిర్మాణం పూర్త చేసుకున్న కాటేజీలు త్వరలో ప్రారంభంకానున్నాయి. పూర్తి సౌకర్యాలతో కూడిన గదుల నిర్మాణం పూర్తయింది. సుడా ఆధ్వర్యంలో పనులు పూర్తి చేశారు. సుమారు రూ.1.50 కోట్లు ఖర్చు చేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేట పర్యాటక కేంద్రంగా మారింది. రంగనాయక సాగర్కు వచ్చే అతిథులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 3 కాటేజీలు, రెస్టారెంట్, విశాలమైన హాల్ దీంతో చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా వస్తువులు, ఈత కొలను నిర్మించారు. దీంతోపాటు ఆహ్లాదం కోసం పచ్చని చెట్లను పెంచారు.
రంగనాయకసాగర్ నిర్మాణం 2020లో పూర్తకాగా కాళేశ్వరం నీటితో ఏడాదిపాటు కళకళలాడుతోంది. రంగనాయక సాగర్ మధ్యలో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్, సర్కిల్ కార్యాలయం ఉంది. సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఆధ్వర్యంలో రిసార్ట్ నిర్మాణం చేపట్టారు. రంగనాయక సాగర్ సినిమా షూటింగ్లకు కేంద్రంగా మారనున్నది. ఇటీవల క్షణమొక యుగం సినిమా సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించడం విశేషం.
బిజినెస్ స్పాట్గా..
రిజర్వాయర్ బిజినెస్ స్పాట్గా మారనున్నది. రంగనాయకసాగర్ సుడా కార్యాలయం వద్ద రూ.45 లక్షలతో దుకాణాలు నిర్మాణం చేశారు. మెయిన్రోడ్డు సమీపంలో నిర్మించిన దుకాణాలు అద్దెకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అద్దె టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు.
పర్యాటక కేంద్రంగా..
రంగనాయకసాగర్ తీరాన పర్యటకులు అధికంగా వస్తున్నరు. రిజర్వాయర్ అభివృద్ధికి మంత్రి హరీశ్రావు చొరవతో సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారు. రిజర్వాయర్ అద్భుతంగా తయారైంది. సుమారు 9 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించారు. రిజర్వాయర్ చుట్టూ పర్యాటకంగా మార్చేందుకు మంత్రి హరీశ్రావు ప్రణాళిక రూపొందిస్తున్నారు. త్వరలో రిసార్ట్ను మంత్రి హరీశ్రావు ప్రారంభిస్తారు.
– వేలేటి రోజాశర్మ, జడ్పీ చైర్పర్సన్, సిద్దిపేట జిల్లా