మనోహరాబాద్, జనవరి 11 : మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. మనోహరాబాద్ ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న జైపాల్రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో మంగళవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.
మేడ్చల్ జిల్లాలోని ఆయన నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ డీఎస్పీ ఆనంద్రావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించి, వివరాలను సేకరించారు.