నర్సాపూర్/ చిలిపిచెడ్, జూన్ 4 : నర్సాపూర్ మండల పరిధిలోని ఖాజీపేట్ గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతోపాటు వడగండ్ల వాన తోడవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పాటు రేకుల షెడ్లు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. గాలివాన బీభత్సానికి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. 40 ఎల్టీ, 11 కేవీ కరెంట్ స్తంభాలు విరిగాయి. 4 రేకుల షెడ్లు, నాలుగు ఇండ్లు ధ్వంసమయ్యాయి. వీటితోపాటు 20 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విపరీతమైన గాలివాన వీయడంతో గ్రామస్తు లు ఆందోళనకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వం ఆదు కోవాలని సర్పంచ్
చిలిపిచెడ్ మండలంలో గాలి దూమారం బీభత్సం సృష్టిం చింది. మండలకేంద్రం చిలిపిచెడ్ శివారులో నాలుగు 33 కేవీ విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రహీంగూడ తండా, సోమక్కపేట గేటు సమీపం లోని రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి, చండూర్ తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. గూజిరి తం డాలో పిడుగుపడి గడ్డివాము పూర్తిగా దగ్ధమైనది. సమాచారం తెలుసుకున్న జోగిపేట అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అనంతరం ఏఎస్సై మిస్బోద్దీన్, సర్పంచ్ రాకేశ్నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.