రామాయంపేట, జూలై 10: బీఆర్ఎస్ కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే విజయం మనల్ని వరిస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి స్వగృహంలో రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు కొద్దిరోజుల్లో జరుగనున్నాయని, కార్యకర్తలందరూ విజయం కోసం పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. కార్యకర్తల కోసం అనునిత్యం పని చేస్తున్నానన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మూడో సారి గెలుపే లక్ష్యంగా పనిచేసి హ్యాట్రిక్ కొట్టేలా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని, వాటన్నింటినీ ప్రచారాస్ర్తాలుగా ఉపయోగించుకోవాలన్నారు. పట్టణాభివృద్ధికి కోట్లాది రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, పనులు కొనసాగున్నాయన్నారు. సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, కౌన్సిలర్లు దేమె యాదగిరి, చిలుక గంగాధర్, కో-ఆప్షన్ సభ్యులు పాతూరి ప్రభావతి, ఎస్కే హైమద్, బాలుగౌడ్, బీఆర్ఎస్ నాయకులు శ్యామ్కుమార్, మల్యాల కిషన్, చంద్రపు కొండల్రెడ్డి, రాజు యాదవ్, మర్కు దత్తు, శ్రీనివాస్, మల్లేశం, యాదగిరి, గంగారాం తదితరులున్నారు.