మెదక్ అర్బన్, అక్టోబర్ 21 : ప్రజల రక్షణ, దేశభద్రత పోలీసుల లక్ష్యమని, పోలీసులు ప్రాణాలకు తెగించి ఎన్నో త్యా గాలు చేస్తూ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లో ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతి థిగా హాజరై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ రోహిణిప్రియదర్శినితో కలిసి పోలీసు అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ… ప్రజలకు సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగడానికి శాంతి భద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసులు శాంతిభద్రతల విషయంలో 24 గంట లు విధులు నిర్వహిస్తూ తమ జీవితాలను ప్రజలకు అంకితం చేస్తున్నారని తెలిపారు. పోలీసు పాత్ర సమాజానికి చాలా ముఖ్యమని, ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రజలకు రక్షణకు నిరంతరం పనిచేస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. దేశ రక్షణతోపాటు ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. మెదక్ జిల్లాలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఎప్పుడూ అండగా నిలుస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఎస్పీ రోహిణిప్రియదర్శిని మాట్లాడుతూ… పోలీస్ ప్రజా సేవకుడన్నారు. 1959 అక్టోబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువు లు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటిస్తున్నట్లు తెలిపారు. ఫ్ల్లాగ్ డే ముఖ్య ఉద్దేశం విధి నిర్వ హణలో అమరులైన పోలీసుల జీవితాలను ప్రతి పోలీసు మా ర్గదర్శకంగా, ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు అంకితం కావా లని ఎస్పీ రోహిణిప్రియదర్శిని పిలుపునిచ్చారు. ప్రజల రక్షణ కు పునరంకితం కావాలని కోరారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, విచ్ఛిన్నకర శక్తులతో పోలీసులు అనుక్షణం పోరాడు తున్నట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగం కత్తిమీద సాముగా ప్రమాదకరం గా పరిణమించిందన్నారు. దేశంలో విధి నిర్వహణలో ఈ యే డాది 189 మంది వీరమరణం పొందారని తెలిపారు.
ఏ.బాలసుబ్రహ్మణ్యం (డీఎస్పీ తూప్రాన్), వై.వెంకట్ స్వామి (సీఐ తూప్రాన్), బి.దామోదర్రెడ్డి (ఎస్సై కౌడిపల్లి), ఎం.రాములు (ఏఆర్హెచ్సి 188 డీఏఆర్ మెదక్), అబిద్ హుస్సేన్ (పీసీ330 పాపన్నపేట పోలీస్స్టేషన్), డి.రాం చం దర్ (పీసీ1185 పాపన్నపేట పోలీస్స్టేషన్), రఘునందన్ (హెచ్సీ446 పాపన్నపేట పోలీస్స్టేషన్), మల్లేశం (పీసీ43 కౌడిపల్లి పోలీస్స్టేషన్), ఎన్.లక్ష్మణ్నాయక్ (పీసీ807 శివ్వంపేట పోలీస్స్టేషన్), ఈ.శ్రీనివాస్రావు (పీసీ1374 శివ్వంపేట పోలీస్స్టేషన్), ఎండీ సుజాయత్ అలీ (పీసీ1261 శివ్వంపేట పీఎస్), పెంటయ్య (హెచ్సీ 943 తూప్రాన్), టి.నర్సింహులు (పీసీ1193 పాపన్నపేట పీఎస్), నీరుడి ప్రసాద్ (పీసీ117 పాపన్నపేటపీఎస్) విధి నిర్వహణలో వీరమరణం పొందారు. త్యాగమూర్తుల కుటుంబ సభ్యులను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ రోహిణిప్రియదర్శిని పరామర్శించి, కానుకలు అందజేశారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్)మహేందర్, డీఎస్పీ లు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ డీ ఎస్పీ సుభాష్చంద్రబోస్, పోలీస్ అధికారులు నాగేశ్వర్రావు, అచుత్యరావు, సీఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు పాల్గొన్నారు.