గజ్వేల్/మర్కూక్, ఏప్రిల్ 9: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉగాది శుభాకాంక్షలు తెలిపేందుకు మంగళవారం మధ్యా హ్నం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఆయా గ్రామాలకు చెందిన పార్టీ ముఖ్యులు, కార్యకర్తలు కేసీఆర్ను కలిసేందుకు తరలివచ్చారు. కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో స్వయంగా కేసీఆర్ బయటకు వచ్చి కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు జహంగీర్, శ్రీనివాస్ తదితరులు కేసీఆర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మీ అభిమానానికి ధన్యవాదాలు
ఉగాది పండుగ శుభకాంక్షలు తెలిపేందుకు ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రానికి వేలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఒక్కొక్కరిని కలిస్తే సమయం ఆలస్యమవుతున్న విషయం తెలుసుకొని కేసీఆర్ బయటకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, ముస్లింలకు ఉగాదితోపాటు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అభిమానానికి ధన్యవాదాలు.. మనమందరం తెలంగాణ సాధించినవాళ్లం ఇక ముందు మన ప్రయాణం చాలా ఉందన్నారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ శుభం కలుగాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. జై తెలంగాణ నినాదాలతో వ్యవసాయక్షేత్రం మార్మోగింది.
కేసీఆర్ను కలిసిన దుబ్బాక నేతలు
దుబ్బాక, ఏప్రిల్ 9: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవా రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కేసీఆర్ను కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జైతెలంగాణ ..జైకేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.