చిలిపిచెడ్/ చిన్నశంకరంపేట/ హవేళీఘనపూర్, మే 12 : కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియో గం చేసుకోవాలని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం కంటివెలుగు శిబిరాన్ని ఎంపీడీవో శశిప్రభ, ఎంపీటీసీ మల్లమ్మసంగాగౌడ్, సర్పంచ్ మనోహరానర్సింహరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ కంటి వెలుగు శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, బీఆర్ ఎస్ నాయకులు శ్రీకాంత్రెడ్డి, విఠల్, రాములు, బుచ్చిరెడ్డి, డాక్టర్లు, వైద్యసిబ్బంది ఉన్నారు.
కంటి వెలుగుతో అంధత్వ నివారణ : సర్పంచ్ మీనా
చిన్నశంకరంపేట మండలంలోని గజగట్లపల్లి గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కందుకూరి మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంధ త్వ నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు చేపట్టిందన్నారు. కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కంటి అద్దాలతోపాటు మందులు అందజేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రసాద్గౌడ్, నాయకులు, మధుసూధన్, నరేశ్గౌడ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ సౌందర్య
హవేళీఘనపూర్ మండలం ఫరీద్పూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ సౌందర్య ప్రారంభించి, ప్రజ లకు కంటి అద్దాలు అందజేశారు. కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బ్రహ్మం, పీఏసీఎస్ చైర్మన్ బ్రహ్మం, మాజీ సర్పంచ్ బ్రహ్మం, ఉప సర్పంచ్ వెంకట్ తదితరులు ఉన్నారు.