మనోహరాబాద్/ చిలిపిచెడ్/ కొల్చారం/ చిన్నశంకరంపేట, జనవరి 31 : అంధత్వ రహిత తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం గౌతోజిగూడెంలో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ కంటి వెలుగు శిబిరాలకు వెళ్లి, కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. పేదల సంక్షేమ మే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక ప థకాలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపా రు. అనంతరం అంగన్వాడీ కేంద్రా న్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలశాఖ అధికారి కృష్ణమూర్తి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పురం మహేశ్ ముదిరాజ్, ఎంపీపీ నవనీతారవి ముదిరాజ్, ఎంపీడీవో అరుంధతి, ఉపసర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రేణుకుమార్, పీహెచ్సీ సూపరింటెండెంట్ ఆనంద్, సర్పంచ్ వెంకటేశ్వర్లు, నాయకులు శ్రీరామ్, ఆనంద్ ముదిరాజ్ పాల్గొన్నారు.
నాయిన్జలాల్పూర్లో ‘కంటి వెలుగు’ ప్రారంభం
చిలిపిచెడ్ మండలంలోని చండూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి ప్రారంభించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వాతీజగన్మోహన్రెడ్డి, కార్యదర్శి జితేందర్, డాక్టర్ శ్రీలక్ష్మి, ఐకేపీ సీసీ పురుషోత్తం, ఏఎన్ఎం పద్మ, ఆశవర్కర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.
కొల్చారం పీహెచ్సీలో నేత్ర పరీక్షలు
కొల్చారం మండలంలోని నాయిన్జలాల్పూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వెలుగు శిబి రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ కమిటీ డైరెక్టర్ రాయన్న అన్నారు. కంటి పరీక్షలను కొల్చారం పీహెచ్సీ వైద్యాధికారి రమేశ్ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, కంటి వైద్య నిపుణుడు శైలేందర్, కృష్ణ, నాయకులు వెంకట్నర్సింహులు, కర్రె సంజీవులు, ఫీల్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎంలు లలిత, సంగీత, ప్రవీణ, ఆశ వర్కర్లు నవనీత, రమ్య, కవిత,లలిత ఉన్నారు.
రుద్రారంలో సన్నాహాక సమావేశం
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయిసింధు పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారంలో సర్పంచ్ లక్ష్మణ్ అధ్యక్షతన కంటి వెలుగుపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయిసింధు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలతోపాటు మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్ ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.