దుబ్బాక నియోజకవర్గంలో మరమ్మతులకు రూ.40 కోట్లు మంజూరు
సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు
మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక, జూన్ 5 : సీఎం కేసీఆర్ దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతు పనులకు రూ.40 కోట్లు నిధులు మంజూరు చేయడంతో టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నూతనంగా మరిన్ని బీటీ రోడ్లు, ఎలక్ట్రిసిటీ స్తం భాలు, ట్రాన్స్ఫార్మర్లకు కావాల్సిన నిధులు మంజూరుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆదివారం దుబ్బాక ఎంపీడీవో కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిధులు కేటాయించారని తెలిపారు. నియోజకవర్గంలో 7 మండలాల్లో రహదారుల మరమ్మతు పనులకు కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారని తెలిపారు.
నియోజకవర్గంలో 150 పీఆర్ రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించగా, రూ.40 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. సీఎం కేసీఆర్కు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రహదారుల అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఆర్అండ్బీ రోడ్లకు నిధులు మంజూరు కావడంతోపాటు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మల్లన్నసాగర్ నిర్మించడం దుబ్బాక నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. దేశ చరిత్రలో మహోన్నత అభివృద్ధి కార్యక్రమంగా మల్లన్న సాగర్ నిలిచిపోతుందన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి అన్ని మండలాలకు సాగునీరు అందిస్తామన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్
దుబ్బాకలో నిర్మించిన సీఎం కేసీఆర్ బడి, డబుల్ బెడ్రూం ఇండ్లు త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుంటామని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు. అధునాతన హంగులతో నిర్మించిన సీఎం కేసీఆర్ బడితోపాటు డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, నాయకులు రొట్టే రాజమౌళి, బానాల శ్రీనివాస్, బండి రాజు, భూంరెడ్డి, సద్ధి రాజిరెడ్డి, నారాగౌడ్, తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి, తదితరులు పాల్గొన్నారు.