మెదక్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా 40 బృందాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు లక్షా 57వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో పురుషులు 75,078 మంది కాగా, మహిళలు 82,173 మంది ఉన్నారు. 18వేల మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మరో 16,964 మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు. సోమవారం 27వ రోజు 6285 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 2968 మంది కాగా, మహిళలు 3315 మంది ఉన్నారు. 558 మందికి కంటి అద్దాలు పంపిణీ చేయగా, 539 మందికి అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చామని డీఎంహెచ్వో డాక్టర్ చందూనాయక్ తెలిపారు. కంటి వెలుగు శిబిరాల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేస్తున్నామని తెలిపారు.
ప్రజల కంటి చూపు పదిలంగా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, కంటి పరీక్షలు చేస్తున్నది. సోమవారం 27వ రోజు జిల్లాలో ఏర్పాటు చేసిన 66 కంటి వెలుగు శిబిరాల్లో 17020 మందికి పరీక్షలు చేశారు. చదువుకునేందుకు చూపు మందగించిన 1236 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. సాధారణ చూపునకు అవసరమున్న వారికి 1016 అద్దాలను మందికి అందజేశారు. ఆపరేషన్లు అవసరమున్న 1607 మందికి ఇతర దవాఖానలకు శస్త్ర చికిత్సల నిమిత్తం సిఫార్సు చేశారు. కంటి వైద్యులతో వైద్య పరీక్షలు చేసుకున్న వారిలో అత్యధికంగా మహిళలు 8429 మంది, పురుషులు 8591మందికి అన్ని రకాల చికిత్సలు చేశారు. రీడింగ్ అద్దాలను మహిళలకు 593 మందికి, 643 పురుషులకు అద్దాలు అందజేశారు. దీంతో పాటు శస్త్ర చికిత్సల నిమిత్తం ప్రతిపాదించిన వారిలో మహిళలు 778 మంది కాగా, 1607 మంది పురుషులు ఉన్నారు.