మెదక్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలు వానకాలం, యాసంగి సాగు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంట్ సరిగ్గా ఉండకపోయేది. ఎరువులు, విత్తనాల కోసం క్యూలు పట్టాల్సి వచ్చేది. సాగునీటి సమస్య వేధించేది. పండించిన పంట ఉత్పత్తులు దళారులకు అమ్మాల్సి వచ్చేది. కరువు కాటకాలు, అప్పులతో రైతు ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. రైతులు చేసేదేమీలేక ఉన్న భూమిని అమ్ముకుని ఉపాధి కోసం వలస వెళ్లిన పరిస్థితులు ఉండేవి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన ప్రభుత్వ చేయూతతో ఎవుసం పండుగలా మారింది. 24గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా అవుతున్నది. ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి. నీటి వసతి పెరిగింది. రైతుబంధు పెట్టుబడికి అక్కరకు వస్తున్నది. దీంతో రైతులు ఉన్న ఊర్లోనే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు. గుంట జాగ లేకుండా పంటలు పండిస్తున్నారు. దీంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. రైతులకు పరపతి పెరిగింది. ఎకరం భూమి అమ్మితే కోట్ల రూపాయలు వస్తున్నాయి. రెండు, మూడు ఎకరాలు ఉన్న రైతు కూడా ఇప్పుడు ధీమాగా బతుకుతున్నాడు. ఒకప్పుడు పట్నం, దుబాయ్ వెళ్లిన వారు ఇప్పుడు ఊర్లోకి తిరిగొచ్చి ఉపాధి పొందుతున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులు వచ్చే ప్రమాదం ఉంది. భూముల ధరలు పతనమైతే తిరిగి ఆత్మహత్యలు మొదలయ్యే పరిస్థితి దాపురిస్తుంది. వ్యవసాయం దండుగ అన్నచోట పండుగలా మార్చిన సీఎం కేసీఆర్తో రైతుల బతుకులు మారుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెసోళ్ల కల్లబొల్లి మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి వారికి ఓటేస్తే మళ్లీ మోసపోతే గోసపడ్తమని రైతులు ఆలోచిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ చెప్పే ధరణి ఎత్తివేత, 24 గంటల కరెంటు రద్దు వల్ల రాష్ట్రం, రైతాంగం కేసీఆర్ పడ్డ పదేండ్ల కృషి వృథా అయితది. ఇగ పటేల్, పట్వారీల పద్దతి అస్తే భూముల మీద గిప్పుడున్న దీమా పోతది. 3 గంటల కరెంటు సాగుకు ఏ మూలకు సలదు. ఎవుసం దెబ్బతింటంది. గీ పదేండ్ల సందే.. తెలంగాణల రైతులు జర ఆనందంగా, మంచిగ బతుకుతుండ్రు. గిదంతా పెద్దసారు కేసీఆర్ పుణ్యమే బిడ్డా. గీ కాంగ్రెసోళ్ల పాలన మాకు వద్దు బిడ్డా. మల్లా గప్పటి దినాలు గుర్తుకొస్తేనే శానా బాధైతది.
కాంగ్రెస్ పాలనలో రాత్రి పగలు పొలం వద్దే పడిగాపులు కాంగ్రెస్ హయాంలో త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడొస్తదో తెల్వకుండే. నాకున్న నాలుగు ఎకరాల పొలంలో వేసిన పంటలు కాపాడుకోవాలని తెల్లందాక, పొద్దుందాక పొలం కాడే పడిగాపులు కాస్తూ పంటలకు నీరు పారబెట్టేది. ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఆ బాధ తీరింది. 24 గంటల ఉచిత విద్యుత్తో నాకు అవసరం ఉన్నప్పుడు పొలానికి నీళ్లు పారిస్తున్న. పంటలు మంచిగా పండిస్తున్న. ఇంత మంచి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు మళ్లీ మునుపటి గతి పట్టేలా వ్యవసాయానికి 3గంటలే కరెంటు ఇస్తామని ప్రచారం చేయడం భయాందోళన కలిగిస్తుంది. మా మద్దతు సీఎం కేసీఆర్కే.
ధరణీ తీసేస్తే మళ్లీ పట్వారీ వ్యవస్థ వస్తుంది. పట్టాదారు రైతు లేకుండా రిజిస్ర్టేషన్లు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ధరణి వల్ల పట్టాదారు రైతు వేలిముద్ర లేనిదే రిజిస్ర్టేషన్ జరగదు .క్షణాల్లో పట్టాదారు నుంచి కొనుగోలు దారునిపేరుపై వెంటనే అమలవుంది. కాంగ్రెస్ అంటేనే దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకోసం ప్రవేశ పెట్టిన పథకాలను వాళ్లు దోచుకునే విధంగా రూపొందించడం వారికి వెన్నుతో పెట్టిన విద్య. రైతుల జోలికొస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే..
ఎవుసానికి మూడు గంటల కరంటు ఇస్తామని కాంగ్రెస్ అంటున్నది. ఇగ పది ఆస్పర్లు మోటర్లు పెట్టుకోవాలని కూడా చెప్తునుడ్రు. ఇట్లా అయితే మళ్ళీ ఎవుసం ఆగమైతది. రైతులకు ఆత్మహత్యలే దిక్కవుతాయి. దీనికి తోడు ధరణిని రద్దు చేసి కౌల్దార్ చట్టం తెస్తామని అంటుండ్రు. మీటర్లు పెట్టడం వల్ల ఉచిత విద్యుత్ లేకుండా పోతది. కరంటు బిల్లులు తడిసి మోపైపోతాయి. కట్టలేక రైతులు అప్పులు జేసుకోవాలి. ఎవుసం తెల్వని కాంగ్రెస్, బీజేపీ పాలన మాకొద్దు. మల్లా ముఖ్యమంత్రి కేసీఆర్నే గెలిపించుకుంటం.
ఒకప్పుడు మెదక్ జిల్లాలో 50 వేల ఎకరాల్లోనే పంటలు పండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి వసతి పెరగడం, రైతుబంధు సాయం అందించడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 3లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. దీంతో రైతన్న రెండు పంటలు పండించుకుని ఆనందంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ పాత రోజుల్లాగే సాగు విస్తీర్ణం పడిపోయే ప్రమాదం ఉంది.దీంతో రైతులు, రైతు కూలీలకు ఉపాధి కరువవుతది. దీంతో మళ్లీ వలసలు, రైతు ఆత్మహత్యలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది.
పడేండ్ల కిందట పంటలు వేసే ప్రతిసారి లాగోడి కోసంబతిమిలాడి అప్పులు తెచ్చేది. మాకున్న ఆరెకరాల్లో వేసిన పంట పండినా, ఎండినా అప్పు కట్టాలిక వచ్చేది. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి లాగోడికి రైతుబంధు పైసలు సక్కగ బ్యాంకుల పడుతున్నయ్. అప్పుల కోసం బతిమిలాడే రోజులు పోయినయ్. రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్ను ఓటుతో బుద్ధి చెప్పి మళ్లీ కేసీఆర్నే గెలిపించాలె.
ముందుగల్ల గీ తెలంగాణల కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రారు. ఇగ, గా కాంగ్రెసోళ్లు గనుక వచ్చి ధరణిని తీసేస్తే దళారులే రాజ్యమే వస్తది. ఇప్పుడైతే అందరం ధరణితో ధైర్యంగా ఉన్నం, ధరణి తీసేస్తే మళ్లీ పటేల్, పట్వారీల వ్యవస్థతో ఇబ్బందులు పడాల్సిందే. రైతులు సంతోషంగా ఉంటే.. కాంగ్రెస్ ధరణిని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నది. ధరణి లేకపోతే అన్నదాతలు ఆగమైతరు. కాంగ్రెస్ కౌలు రైతుల కోసం నూతన చట్టాన్ని తెస్తే.. భూ యజమానులకు, కౌలురైతులకు మధ్య గొడవలు జరుగుతాయి. అసలైన యజమానులు భూమి హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవడమే ఉత్తమం.
తెలంగాణలో రైతులం ఇప్పుడిప్పుడే జర బాగుపడుతున్నం. గతంలా కాంగ్రెస్ పాలనలో శానా కష్టాలు పడ్డం. భూములు, కరెంటు, ఎరువులు, విత్తనాలు, నీటి సమస్యలు ఎల్లదీసినం. ఎవుసం విడిచి వలసలు పోయినం. మా సుట్టాల్లో శాన మంది ఎవుసం అచ్చిరాక చచ్చిపోయిండ్రు. కానీ తెలంగాణ వచ్చిన తరువాత వలస పోయినోళ్లు తిరిగి వచ్చిండ్రు. అప్పులు తీర్చిండ్రు. దర్జాగా బతుకుతుండ్రు. గిదంతా గా పెద్దసారు కేసీఆర్ దయే. రైతులంతా కలిశి కాంగ్రెస్ను ఓడిస్తాం.
ఇగ సూడు బిడ్డా.. ఏ రకంగా సూసుకున్న ఎవుసంకు 3 గంటల కరంటు సరిపోదు. తలకాయలేని మాటలే సేప్తున్న గా కాంగ్రెసోళ్లును నమ్మితే తింటందుకు తిండి లేక ప్రజలు ఆగమైతరు. తెలంగాణ అచ్చినంకే పెద్దసార్ కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరంటుతో గుంట భూమి ఖాళీ లేకుండా పంటలను సాగు జేసుకుంటున్నం. తెలంగాణ అచ్చినంకనే భూముల విలువ పెరిగింది. ఎరువులు, విత్తనాలకు ఎం ఇబ్బంది లేదు. కానీ, గీ కాంగ్రెసోళ్లు రైతుల మీద పగబట్టినట్టున్నరు బిడ్డా. నోటికి ఏదోస్తే గది మాట్లాడుతుండ్రు. ధరణి వద్దంటుర్రు. పది అస్పర్ల మోటర్లు పొలాల కాడ పెట్టుమని అంటుర్రు. ఇైట్లెతే రైతులు పంటలు పండించర్రు. మంచిగా కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ మల్లా గెలిపించుకుంటం.
ఎన్నో అష్టకష్టాలు పడి గిప్పుడే రైతులం జర మంచిగా బతుకుతున్నం. 3 గంటల కరెంటు సాగుకు సరిపోదు. అసలు గ మాట అన్నోడిగి ఎవుసం తెల్సా. రేవంత్రెడ్డికి తలకాయ ఉందా. మల్లా గా కాంగ్రెస్ పాలన వస్తే రైతులు వలసలు వెళ్లడంతో పాటు మనస్థాపంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తది. దీనికి తోడు 10హెచ్పీ మోటర్ అంటే ఇగ మాలోంటి తోటైతే గాదు.
పది యేండ్ల కింద ఎవుసంకు ఇప్పటి ఎవుసంకు శానా మార్పు వచ్చింది. గప్పుడు కాంగ్రెస్ సర్కారు ఇచ్చే కరంటు మాకు సరిపోకపోయేది. ఎప్పుడోస్తుందో తెల్వని కరంటు కోసం పంటకు నీళ్లందించాలని మా తల్లిదండ్రులతో కలిసి రాత్రి పొలం కాడికి పోయిన దినాలు గిప్పుడు కూడా గుర్తోస్తున్నాయి. కానీ తెలంగాణ సర్కారులో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులుకు 24 గంటల కరంటు ఇస్తుండు. రాత్రి పూట పొలంకాడికి పోయే కష్టాలు తీరినయి. 10 హెచ్పీ మోటర్లు పెట్టుర్రి అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుండ్రు. ఈ మోటర్ల తెచ్చుకుంటే నీళ్లను ఒక్కసారిగా బోర్ల నుంచి గుమ్మరించి తర్వాత నీళ్లు రాక మోటర్ బొగ్గు అయితది. అయిన కాంగ్రెస్ అంటేనే మోటర్లు కాలిపోవుడు.గాళ్ల మాట్లలు నమ్మం.
తెలంగాణలో చాలామంది ఎవుసం మీద బతుకుతుండ్రు. పదేండ్ల నుంచి కాలం మంచిగవుతున్నది. పట్నాలకు వలస పోయినోళ్లంతా తిరిగొచ్చిండ్రు. సీఎం కేసీఆర్ దయవల్ల సాగు నీళ్లకు ఇబ్బంది లేకుండా, 24 గంటల కరెంటుతో గుంట ఖాళీ లేకుండా పంటలు పండిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు 3 గంటల కరెంటు అంటుండ్రు. దీంతో సాగు చేసే భూమి తక్కువైతది. పైసలు పుట్టవు. పంటలు, భూములకు ధరలు తగ్గుతాయ్. మళ్ల వలసలు పోవుడు సురువైతది.
ఎన్నో ఏండ్ల నుంచి గ్రామాల్లో కొందరు భూ యజమానులు ఇతర రైతులకు భూములు కౌలుకిస్తున్నారు. నాకున్న 10 ఎకరాల పొలాన్ని కూడా కొన్నేండ్లుగా కౌలుకిస్తున్నా. కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు నా అకౌంట్లో పడుతున్నది. కాంగ్రెస్ కౌలుదారు కాలం తీసుకొచ్చి భూ యజమానికి, కౌలు రైతుకు కొట్లాట పెట్టాలని ఆలోచిస్తున్నది. ఇలాగైతే నా భూమిని బీడు ఉంచుకునే పరిస్థితి. దీంతో కౌలు రైతు పరిస్థితి ఆగమవుతుంది. కౌలు కాలం తీసుకొస్తామన్న కాంగ్రెస్ను కాటికి పంపాలే.
24 గంటల కరెంటు, ధరణి తీసేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కరెంటు కష్టాల వల్ల ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. ఇప్పుడిప్పుడే ఆనందంగా బతుకుతున్నాం. 3 గంటల కరెంటు ఏ విధంగా చూసిన సరిపోదు. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ఇబ్బతింటుంది. దానికి తోడు 10 హెచ్పీ మోటర్ వల్ల రైతుల మీద అధిక భారం పడుతుంది. గతంలో భూములకు ధరలు లేక అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. కానీ ఇప్పుడు భూములకు విపరీతమైన రేట్లు వచ్చాయి. ధరణి తీసేస్తే భూముల ధరలు దెబ్బతింటాయి. ఫలితంగా అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది.