న్యూఢిల్లీ: మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆలిండియా రేడియోలో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితులు, ఆ మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలను ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. అదేవిధంగా కరోనా వైరస్ను అదుపు చేయడంలో వ్యాక్సిన్ కీలకపాత్ర పోషిస్తున్నందున వ్యాక్సిన్ల ప్రాముఖ్యత గురించి ఆయన ప్రజలకు తెలియజేయనున్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2014వ సంవత్సరం నుంచి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి ఆలిండియా రేడియోలో ప్రధాని ప్రసంగిస్తున్నారు.