జేడీఏ ఉషాదయాళ్
పర్వతగిరి, ఏప్రిల్ 9 : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగులో యాంత్రీకరణ పద్ధతులను పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. శుక్రవారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో రూర్బన్ పథకంలో భాగంగా వరి నాటు వేసే యంత్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషాదయాళ్ మాట్లాడుతూ వరి నాట్లు వేసేందుకు కూలీల ఇబ్బందిని అధిగమించడానికి మ్యాట్ పద్ధతిలో తయారు చేసిన ఆరు వరుసల వరినాటు యంత్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. వ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించుకుని రైతులు తక్కువ పెట్టుబడితో లాభం పొందవచ్చన్నారు. గ్రామీణ రైతులు వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ సురేశ్కుమార్, ఏవో ప్రశాంత్కుమార్, రైతు బంధు సమితి కన్వీనర్ మట్టపెల్లి చిన్న మాధవరావు, బాలాజీ రైతు సంఘం బాధ్యులు నవనీతరావు, ఏఈవోలు రాజేశ్, రవి, స్రవంతి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రం
పరకాల : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కామారెడ్డిపల్లి రైతు వేదికలో వరి కొనుగోలు, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ యాసంగి సీజన్లో వరి పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. 17శాతం తేమ మించకుండా ధాన్యాన్ని కల్లాల్లోనే పూర్తిగా ఆరబోసి, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ ఏరుకొండ శ్రీనివాస్, ఏడీఏ రవీందర్, కామారెడ్డిపల్లి సర్పంచ్ రాజయ్య, ఏవోలు శ్రీనివాస్, యాకయ్య, గంగా జమున, యాదగిరి, హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ విజయానికి ‘వకీల్సాబ్’కు సంబంధం ఏమిటి? : మంత్రి నాని