అమరావతి : తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ విజయానికి.. వకీల్సాబ్ సినిమాకు సంబంధం ఏమిటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ, సమాచార శాఖల మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
పువ్వు గుర్తుకు ఓటెయ్యమంటూ బీజేపీ నాయకులు జనాల చెవిలో పువ్వులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.
వకీల్ సాబ్ను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని బీజేపీ నాయకులు అనడం హాస్యాస్పదం.
మరి సొహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షా ఎవరికి భయపడుతున్నారని మంత్రి నాని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. తిరుపతిలో మంత్రి పేర్ని నాని విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో వకీల్ సాబ్ సినిమాకు నాలుగు షోలకే అనుమతి ఉందని ఆయన తెలిపారు.
సినిమా టికెట్ ధర గుర్తించి బీజేపీ నాయకులు సునీల్ దేవధర్, జయ ప్రకాష్ రెడ్డి గొడవ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కాగా వకీల్ సాబ్ బెనిఫిట్ షో రద్దు చేశారని ఆరోపిస్తూ తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ నాయకులు సునీల్ దేవధర్, భానుప్రకాష్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
వకీల్ సాబ్ను చూసి సీఎం జగన్ భయపడుతున్నారని వారు అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి